దేశంలో అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించాలని, నల్లధన కుబేరుల సామ్రాజ్యాలను భూస్థాపితం చేయాలని కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం.. ఆయనకు తన అభిమానులు దూరం చేస్తుంది. అదేంటి అంటారా..? సామాజిక మాద్యమం ట్విట్టర్ లో మోడీని కోట్ల మంది దేశ ప్రజలు ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేయగానే అయనను సామాన్య అభిమానుల సెగ తగిలింది. హఠాత్తుగా తీసుకున్న నిర్ణయ పరిణామేమో కానీ ఆయనను ఏకంగా మూడున్నర లక్షల మంది అన్ ఫాలో అయ్యారు.
దీంతో నోట్ల రద్దుతో నల్లధన కుబేరులు కాకుండా మధ్య, పేద వర్గాలకు చెందిన అనేక మంది శ్రమజీవులు ఇబ్బందుల పాలవుతున్నారని తేటతెల్లం అవుతోందని. విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల సామాన్యులకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. సోషల్ మీడియాలో వుండాలని, కేంద్రమంత్రులు, పార్టీ నేతలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు అందుబాటులో నిలవాలని ఆయన ప్రధానిగా బాద్యతలు చేపట్టిన తొలినాళ్లలో అదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రభుత్వం తీసుకున్న చర్యపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
ఆ చిన్న ఇబ్బందులూ మోదీకి లక్షల సంఖ్యలో అభిమానులను దూరం చేస్తిందని, ఇలా జరుగుతుందని తాము ఊహించలేదని అంటున్నారు ట్విటర్ విశ్లేషణలు. ఈ నెల తొలినాళ్లలో మోదీకి రోజుకు 25 వేల మంది చొప్పున ఫాలోయర్లు పెరుగుతూ వచ్చారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన ఎనిమిదో తేదీన అయితే ఆశ్చర్యకరంగా 50 వేల మంది ఫాలోయర్లు పెరిగారు. కానీ తర్వాతి రోజు అంటే తొమ్మిదిన ఒక్కసారిగా మూడు లక్షల మంది ఫాలోయర్లు తగ్గిపోయారు. ప్రస్తుతం మోదీకి ట్విటర్లో 2.43 కోట్ల మంది ఫాలోయర్లున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more