కబాలి చిత్ర నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థానును కష్టాలు ముంచెత్తనున్నాయి. అదేంటి కబాలీ సినిమా డివైట్ టాక్ వచ్చిన మంచి లాభాలనే కురిపించింది కదా..? అంటారా. అవునండీ మీరంటున్నది కరెక్టే.. కానీ అయన వద్ద రెండు లక్షల రూపాయలకు కూడా లేకపోవడమే కష్టాలకు కారణం. అయితే కష్టాలు కొనితెచ్చిన బహుమానం వింటే షాక్ అవ్వక తప్పదు. కారగారవాసం. అర్థం కాలేదా?
వివరాల్లోకి వెళ్తే.. కబాలీ సినీమ డైరెక్టర్ థానును తక్షణం అరెస్టు చేయాలంటూ చెన్నైలోని నాగర్కోవిల్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కన్యాకుమారీకి చెందిన క్యూ థియేటర్ యజమాని డేవిడ్ కు రెండు లక్షల రూపాయలను చెల్లించాలని అదేశించినా.. గత మూడు సంవత్సరాలుగా వాటిని చెల్లించకపోవడంతో తమిళానాడు నిర్మాతల మండలి అధ్యక్షుడు ధానును తక్షణం అరెస్టు చేసి ఈ నెల 28న తన ముంగిట హాజరుపర్చాలని న్యాయస్థానం అదేశించింది. దీంతో థానుకు కష్టాలు మొదలయ్యాయి.
2009లో ఎస్ జే సూర్య నటించిన తరుమగన్ చిత్రానికి సంబంధించి తాను ఎదుర్కోన్న నష్టాల విషయంలో తనకు నిర్మాత రెండు లక్షల రూపాయలను చెల్లించాలని, 2009లోనే డేవిడ్ నిర్మాత ధానుపై కోర్టులో పిటీషన్ సమర్పించాడు, ఈ పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం రెండు లక్షల రూపాయలను చెల్లించి వివాదాన్ని సర్ధుకోవాల్సిందిగా న్యాయస్థానం నిర్మాత ధానును అదేశించింది. అయితే తన వద్ద ఇప్పుడు లేవని తాను తరువాత చెల్లిస్తానని చెప్పి వెళ్లాడు.
ఇలా మూడేళ్లు గడిచాయి. ఆ తరువాత కూడా రెండు బంపర్ హిట్ చిత్రాలు ధేరి, కబాలి లు హిట్ కోట్టిన తరువాత కూడా చెల్లించలేదు. దీంతో డేవిడ్ మరోమారు న్యాయస్థానాన్ని అశ్రయించాడు. థాను డబ్బులు వుంచుకొని కూడా తనకు రావలసిన రెండు లక్షల రూపాయలను చెల్లించకుండా దాటవేత దోరణిని అవలంభిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దాంతో నాగర్కోవిల్ కోర్టు ఈ నెల 28వ తేదీలోగా నిర్మాత థానును అరెస్ట్ చేయాలని మంగళవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more