తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్ టు పరీక్షలకు టీఎస్పీఎస్సీ పగడ్భందీ ఏర్పాట్లు చేస్తోంది. 1,032 పోస్టుల భర్తీకి గాను నిర్వహించనున్న ఈ పరీక్షలకు ఈ నెల 11, 13 తేదీలలో రాత పరీక్షలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థులకు పలు సూచనలు జారీ చేసింది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులు ఈ సూచనలను తప్పక పాటించాలని, లేని పక్షంలో వారిని పరీక్షలకు సైతం అనర్హులుగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలిపింది.
గ్రూప్ 2 పరీక్షలకు రికార్డు స్థాయిలో 7,89,985 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారికి రాష్ట్రవ్యాప్తంగా 1,911 పరీక్షా కేంద్రాలలో పరీక్షలను నిర్వహించనున్నాట్లు టీఎస్పీఎస్పీ తెలిపింది. నవంబర్ 11న పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగగా, హిస్టరీ, పాలిటీక్స్ అండ్ సొసైటీ లతో కూడిన పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నామని తెలిపింది.
ఇక నవంబర్ 13న పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. పేపర్-4 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. పరీక్ష నిర్వహణను పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరింది. అభ్యర్థులు ఎలాంటి అపోహలు నమ్మొద్దని సూచించింది. పూర్తిస్థాయి సూచనల కోసం తమ వెబ్సైట్ను చూడాలని పేర్కోంది.
అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచనలు:
* అభ్యర్థులు బూట్లు, నగలు, చెవిపోగులు, చేతి గడియారాలు ధరించకూడదు.
* ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, లాగ్ టేబుల్స్, చేతి బ్యాగులు, పర్సులు, నోట్బుక్స్, చార్టులు, రికార్డింగ్ పరికరాలకు తీసుకురారాదు.
* చేతి వేళ్లపై గోరింటాకు(మెహందీ), ఇంక్ వంటివి లేకుండా చూసుకోవాలి.
* అభ్యర్థులు హాల్ టికెట్తోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలని పేర్కొంది.
* హాల్ టికెట్పై ఫొటో కానీ, సంతకం కానీ సరిగా లేని అభ్యర్థులు.. రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలను తెచ్చుకోవాలి.
* ఓఎంఆర్ పత్రాన్ని బ్లూ లేదా బ్లాక్ బాల్పాయింట్ పెన్నుతోనే రాయాలి.
* పెన్సిల్, ఇంక్పెన్, జెల్పెన్తో రాసిన ఓఎంఆర్ జవాబు పత్రాలను అనర్హతగా ప్రకటిస్తాం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more