ప్రమాదపుటంచుల్లోకి వెళ్తున్న ఓ మహిళను చుట్టుపక్కల ప్రయాణికులు గమనించి కాపాడిన షాకింగ్ ఘటన ఇది. మొన్నా అ మధ్య బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముంబాయిలోని ఓ రైల్వే స్టేషన్లో రన్నింగ్ రైలు దిగిన ఓ యువతి రైలు కింద పడబోగా, రైల్వే కానిస్టేబుల్ తక్షణం స్పందించి వారిని కాపాడిన వీడియోను షేర్ చేసిన ఘటనను మార్చిపోకముందే.. తరహాలోనే ఇక్కడ కూడా ఓ మహిళ పట్టుతప్పి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ మీద కిందపడిపోయి అలాగే దొర్లుతూ వెళ్లి రైలు కింద పడబోయింది. ప్రమాదానికి చేరువతున్న మహిళను గమనించిన చుట్టుపక్కల వారు సకాలంలో స్పందించి సాయం చేయడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.
అయితే అమె కూతుర్ని మాత్రం ప్రయాణికులు కాపాలేకపోవడంతో అమె రైలు కింద పడి మృతిచెందింది. మహారాష్ట్రలోని థానేలో ఒళ్లు గగుర్పొడిచే ఘటనకు సంబంధించిని వివరాలిలా ఉన్నాయి. ఓ మహిళ తన కూతురుతో పాటు బంధువుల ఇంటికి వెళ్లేందుకు థానేలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ జంక్షన్ కు వచ్చింది. అయితే అప్పటికే తాను వెళ్లాల్సిన ట్రైన్ ప్లాట్ ఫామ్ పై నుంచి కదులుతున్నందున అదే తమ ట్రైన్ అని భావించి.. రన్నింగ్ చేస్తూ ట్రైన్ ను ఎక్కేశారు.
కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. రన్నింగ్ ట్రెయిన్ ఎక్కిన ఆ మహిళకు షాక్.. అది తాను ఎక్కాల్సిన రైలు కాదని తెలుసుకుంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న తల్లీ కూతుళ్లు.. రైలు నుంచి ఒక్కసారిగా ప్లామ్ ఫాం మీదకి దూకేశారు. అసలే అది రన్నింగ్ ట్రెయిన్ కావడంతో పట్టుతప్పి కిందపడిపోయారు. ఈ క్రమంలో కూతరు దొర్లుకుంటూ రైలు కింద పడబోగా, తల్లిని మాత్రం చుట్టుపక్కల ఉన్నవాళ్లు గమనించి పట్టుకున్నారు. ట్రెయిన్ కింద పడకుండా రక్షించారు. అయితే ఈ ఘటనలో మహిళ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more