హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్ ఇచ్చుకుంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్. అంతేకాదు అసలు వేముల రోహిత్ దళితుడు అనేందుకు ఆధారాలు లేవని, సందేహాలు వ్యక్తం చేస్తూ... కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలకు క్లీన్ చిట్ ఇస్తూ నివేదిక సమర్పించింది.
వేముల రోహిత్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా హెచ్ఆర్డీ (మానవ వనరుల) మంత్రిత్వ శాఖ నియమించిన రిటైర్డ్ జస్టిస్ ఏకే రూపన్వాల్ నేతృత్వంలోని కమిషన్ పేర్కొంది. నివేదికలో ఉన్న సమాచారం ప్రకారం రోహిత్ అతడు దళితుడు కాదని, అతని తల్లి రాధిక మాల కమ్యూనిటికి చెందిన ఆధారాలు లేవని చెప్పిందని తెలుస్తోంది. వేముల రోహిత్ తల్లి రాధిక తన పూర్వీకుల గురించి చెప్పకపోవటం పలు అనుమానాలకు తావిస్తుందని కమిషన్ తెలిపింది. మరోవైపు ఆమె తన బయోలాజికల్ పేరెంట్స్ క్యాస్ట్ చెప్పి ఉంటుందన్నారు.
ఇక ఈ నివేదికలో స్మృతి ఇరానీకి, దత్తాత్రేయకు క్లీన్ చిట్ ఇచ్చారు. అంతేకాదు, యూనివర్సిటీ అధికారులకు కూడా క్లిన్ చిట్ ఇచ్చింది. యూనివర్సిటీ రాజకీయ ఒత్తిడి లేకుండా సాగుతోందని పేర్కొన్నారు. అంతేకాదు రోహిత్ ఆత్మహత్య పైన కేంద్రీయ విశ్వవిద్యాలయ వీసీని కూడా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన పాత్రపై ఎటువంటి సమాచారం అందులో పొందుపరచలేదు.
కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతని ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పలువురు రాజకీయ నాయకులు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వచ్చి ఆందోళనలకు మద్దతు పలికారు. రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు వచ్చారు. వారంతా కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను టార్గెట్ చేసారు. రోహిత్ వేముల వారి పేర్లు రాసి చనిపోయారని ఓ సూసైడ్ నోట్ ఉందని చెప్పి ఆ మంత్రులను టార్గెట్ చేయగా, తాజాగా కమిషన్ నివేదికతో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more