యూరి ఉగ్ర దాడి అనంతరం పాక్ ఆక్రమిత కశ్మీర్ చోచ్చుకుపోయిన భారత సైన్యం ఏకంగా 38 మంది ఉగ్రవాదులను హతమార్చి క్షేమంగా తిరిగి రావడంపై మిగతా దేశాలన్నీ భారత్ కి మద్ధతు ప్రకటిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని సహించాల్సిన అవసరం లేదన్న సందేశాన్ని భారత్ చాలా గట్టిగా ఇచ్చిందని అగ్ర రాజ్యం అమెరికాతో సహా పొరుగుదేశాలన్నీ ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సర్జికల్ దాడి అనేది అంతా కట్టు కథేనా? అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.
దేశంలోని సొంత నేతలే కాదు.. ఐరాస వ్యక్తపరుస్తున్న సందేహాలను నిశితంగా పరిశీలిస్తే, ఈ అనుమానాలు ఎవరికైనా కలుగుతాయి. విషయం ఏంటంటే... సరిహద్దుల్లో భద్రతను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సైనిక బృందాన్ని (యూఎన్ఎంజీఐపీ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సరిహద్దులో పర్యవేక్షిస్తున్న ఈ బృందానికి సర్జికల్ దాడిపై కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఒకటి ఏకంగా 38 మంది ఉగ్రవాదులు మరణిస్తే, మిగతా ఉగ్ర బృందాల్లో ఎడతెగని చర్చ జరుగుతుంది. కానీ, ఇంతవరకు సంభాషణలను, సందేశాలను ఇచ్చి పుచ్చుకున్నట్టు దాఖలాలు కనిపించడం లేదు. ఇక రెండోది వారు చర్చలు జరపకుండా ఐఎస్ఐ నిలువరించి వుండవచ్చని, లేకుంటే ఒకరిద్దరు ఉగ్రవాదుల్ని చంపి భారత్ ఆ సంఖ్యను పెంచి చెప్పుండాలని భావిస్తోంది. ఇక మూడోది 38 మంది మృతదేహాలు, వాటి అంత్యక్రియల విషయం ఎంత దాచాలన్నా దాగే అంశం కాదు. వీటిని తరలించడం సమీప గ్రామాల్లోని ప్రజల కంటపడే తీరుతుందన్నది మరో వాదన.
ఐరాస కూడా అనుమానాలు లేవనెత్తున్న నేపథ్యంలో భారత్ నిజంగా సర్జికల్ దాడులు జరిపివుంటే, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన వీడియో ఫుటేజ్ ని వెంటనే విడుదల చేయాలని సామాజిక మాధ్యమాల్లో డిమాండ్ పెరుగుతోంది. వాస్తవానికి కార్గిల్ లోకి పాక్ సైనికులు చొచ్చుకు వచ్చిన వేళ, తొలుత ఆ దేశం తామాపని చేయలేదని బుకాయించింది. ఆ సమయంలో పాక్ జనరల్ గా ఉన్న ముషారఫ్, అప్పటి పాక్ సైన్యం ప్రధానాధికారి మొహమ్మద్ అజీజ్ మధ్య సంభాషణను ట్రాప్ చేసిన భారత 'రా' అధికారులు దాన్ని బహిర్గతం చేసి పాక్ కుట్రను ప్రపంచానికి చూపారు.
ఇప్పుడు కూడా తమ దేశంపై దాడి జరగలేదని పదే పదే చెబుతున్న పాక్ కు అంతర్జాతీయ దేశాల నుంచి మద్దతు పెరగక ముందే, ఆ దేశాన్ని మరింత ఏకాకిని చేయాలంటే సర్జికల్ స్ట్రయిక్స్ కు సంబంధించిన ఫుటేజ్ ని వెంటనే బయటపెట్టాల్సి వుంది. అయితే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాత్రం కాస్త వెయిట్ చేయాల్సిందేనన్న సంకేతాలు పంపించారు. సొంత దేశంలో కూడా వ్యతిరేకత రావటం, అది రాజకీయ అంశంగా మారటం చిక్కుల్లో పడేసే అంశంగానే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సాక్ష్యాలు బయట పెట్టడంలో మరింత ఆలస్యం అయ్యే కొద్దీ అది ఇండియాకే నష్టమని రాజకీయ నిపుణులు సైతం వారిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more