కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేస్ బౌలర్ల ధాటికి పర్యటక జట్టు న్యూజీలాండ్ మూడో రోజు తొలి సెషన్ లోనే అలౌట్ అయ్యింది. 317 పరుగులను సాధించే క్రమంలో టీమిండియా బౌలర్ల ముందు కివీస్ మోకరిల్లారు. దీంతో 204 పరుగులకు అంతా పెవీలియన్ కు చేరకున్నారు. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 204 పరుగులకు ఆలౌట్ కావడంతో టీమిండియాకు 112 పరుగుల ఆధిక్యం లభించింది. 128/7ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం ఇన్నింగ్స్ ను కొనసాగించిన న్యూజిలాండ్ మరో 76 పరుగులు చేసింది.
మూడో రోజు ఆటలో ఓవర్ నైట్ బ్యాట్స్ మన్ జీతన్ పటేల్(47;47 బంతుల్లో 9 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అతనికి మరో ఓవర్ నైట్ బ్యాట్స్ మన్ వాట్లింగ్(25) చక్కటి సహకారం అందించడంతో కివీస్ రెండొందల మార్కును దాటగల్గింది. ఈ జోడి 60 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన అనంతరం జీతన్ పటేల్ ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. ఆపై వాట్లింగ్, వాగ్నర్ లను షమీ అవుట్ చేయడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు సాధించగా,షమీ మూడు, జడేజా, అశ్విన్లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 316 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more