మళ్లీ యూరిలో కాల్పులు.. 10 మంది ఉగ్రవాదుల హతం | Army foils infiltration bid kills 10 terrorists in Uri sector

Army foils infiltration bid kills 10 terrorists in uri sector

Army foils Uri attack again, 0 terrorists in Uri sector, Terrorists again on Uri, Uri attack again, attack on Uri, army killed terrorists, Uri revenge attack

Army foils infiltration bid kills 10 terrorists in Uri sector 2 days after terror attack.

యూరీపై మళ్లీ ‘ఉగ్ర’గురి... 10 మంది కాల్చివేత

Posted: 09/20/2016 05:29 PM IST
Army foils infiltration bid kills 10 terrorists in uri sector

జ‌మ్ముక‌శ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో మంగళవారం ఉగ్ర‌వాదులు మ‌రోసారి చొర‌బాటుకి ప్ర‌య‌త్నించారు. అయితే, అప్ర‌మ‌త్తంగా ఉన్న భార‌త సైన్యం వారి చొర‌బాటును దీటుగా తిప్పికొట్టింది. పది మంది ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టింది.

పాక్ సైన్యంలా వేషం వేసిన ఉగ్ర‌వాదులు భార‌త్‌లోకి ప్ర‌వేశించాల‌ని చూసిన‌ట్లు స‌మాచారం. యూరీ ఘ‌ట‌న త‌రువాత అక్కడి ప్ర‌తి అంశాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తోన్న భార‌త భ‌ద్ర‌తాబ‌ల‌గాలు ఉగ్ర‌వాదుల చొర‌బాటును వెంట‌నే క‌నిపెట్టి, దీటుగా జ‌వాబిచ్చాయి. ఆర్మీ ఉన్న‌తాధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు అక్క‌డి ప‌రిస్థితిపై స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు.

కాగా, యూరీ సెక్టార్ లోని లచిపొరా, ఎల్ఓసీ వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్ దళాలపై విరుచుకుపడమంటూ భారత్ బలగాలను కేంద్రహోం శాఖ మంత్రి రాజ్ నాథ్ ఆదేశించారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పాక్ దళాలను సమర్థంగా తిప్పికొట్టాలని అన్నారు. ఈ మేరకు ఆర్మీ డీజీతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. రాజ్ నాథ్ వ్యాఖ్యలు భారత్ బలగాల్లో స్థయిర్యాన్ని మరింత పెంచాయి. కాగా, రెండు రోజుల క్రితం జమ్మూకాశ్మీర్ లోని ఉరీ క్టార్ ఆర్మీ బేస్ క్యాంప్ పై ఉగ్ర దాడి ఘటనలో 18 మంది జవాన్లు మృతి చెందారు. ఈ సంఘటన మరవక ముందే, సరిహద్దుల్లో పాకిస్తాన్ మళ్లీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uri  attack  10 terrorists  killed  

Other Articles