తిరుపతి ఇంధిరా గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న ప్రస్తానం బహిరంగ సభలో జనసేనాని పవన్ కల్యాన్ అధికార పక్షాలపైనే కాకుండా ఇటు ప్రతిపక్షాలకు చెందిన నేతను కూడా పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. ప్రశ్నిస్తానన్న వాడు ఎందుకు రావడం లేదని, ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై కూడా ఆయన స్పందించాడు. ఇంకోందరైతే తాను ప్రధాని మోదీకి, తెలుగుదేశానికి భజనసేన అని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన చెందారు. సినిమాల్లోనే గబ్బర్సింగ్ రాజకీయాల్లో రబ్బర్సింగ్ అంటూ తనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన విమర్శలను ప్రస్తావించారు. అయితే వీటన్నింటినీ పడాల్సిన అవసరం ఉందనీ, పడతానని పేర్కొన్నారు.
అయితే తాను ఏదిపడితే అది మాట్లాడే టైపు కాదని, ఏదైనా ఆచితూచి మాట్లాడతానని జనసేనాధిపతి పవన్ కల్యాణ్ అన్నారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సస్పెండ్ అయి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుందని పరోక్షంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి అన్నారు. తనపై ఎవరెన్ని ఆరోపణలు చేసినా పట్టించుకోనని, ఏదైనా పూర్తిగా నిర్ధారించుకున్నాకే, తెలుసుకున్నాకే మాట్లాడతానని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై అన్ని జిల్లాలు తిరుగుతానని, ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు. అధికారంలోకి వచ్చిరాగానే అది ఇది అంటే కాదని, అందుకోసం గత రెండున్నరేళ్లుగా వేచి చూశామని, ఇకపై తాను ప్రశ్నిస్తానని పవన్ చెప్పారు.
ఇప్పుడు తాను ప్రశ్నించేందుకు సమయం అసన్నమైందిని అందుకునే తాను తిరుపతి వేదికగా ప్రశ్నిస్తున్నానన్నారు. ఇకపై తాను ప్రశ్నిస్తాను.. ప్రశ్నిస్తూనే వుంటాను అని నినదించారు. అయితే అధికార పార్టీలు మాత్రమే హోదా కోసం ప్రధానిని అభ్యర్థించాలని, అ పని తమది కాదు అన్నట్లుగా విపక్షాలు వ్యవహరించరాదని అయన సూచించారు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా, డిపాజిట్లు రాని పార్టీలైనా రాష్ట్ర ప్రగతి కాంక్షించి అందరూ కలసికట్టుగా ప్రత్యేక హోదా కోసం పాటుపడాలని పవన్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఎవరు ముందుకు వచ్చినా వారితో కలసి వచ్చేందుకు తాను, తన పార్టీ ఎప్పుడూ సిద్దమేనని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more