తీవ్ర వాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ మరోసారి దాని పంజాను రుచి చూడాల్సి వచ్చింది. దక్షిణ పాకిస్థాన్ లో సోమవారం ఉదయం శక్తివంతమైన బాంబు పేలుడు జరపటంతో దాదాపుగా 42 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ న్యాయవాది బిలాల్ అన్వర్ కాశిని గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో నిన్న హత్యకు గురిగాక , బెలూచిస్థాన్ ప్రొవిన్స్ క్వెట్టా నగరంలోని ఓ ఆస్పత్రికి ఆయన మృతదేహాన్ని తరలించారు.
ఈ క్రమంలో బిలాల్ కు నివాళులర్పించేందుకు వందల సంఖ్యలో వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో మరో 50 మంది తీవ్రంగా పైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది అడ్వకేటులు, మరికొందరు ఆ వార్తను కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ లు ఉన్నారు. సరిగ్గా ఆసుపత్రి నుంచి అన్వర్ కాశి మృతదేహాన్ని తరలిస్తున్న వేళ బయట జనసందోహం ఎక్కువగా ఉండటంతో ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నారు. అంతేకాదు పేలుడు తర్వాత ఎమర్జెన్సీ వార్డు వద్ద తుపాకుల కాల్పులు కూడా వినిపించాయని ఓ ప్రముఖ పత్రిక ప్రకటించింది.
ఈ విషయమై ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ... శాంతికి విఘాతం కలిగించే ఎవరినీ వదలబోమని ప్రకటించాడు. మరోవైపు బెలూచిస్థాన్ ప్రొవిన్స్ ముఖ్యమంత్రి సనావుల్లా స్పందిస్తూ..ఘటనలో కేవలం 30 మంది మరణించారని ప్రకటించాడు. భద్రతా వ్యవస్థ వైఫల్యమే ఘటనకు కారణమని చెప్పిన ఆయన, తానే స్వయంగా ఈ విషయంపై విచారణ జరిపిస్తానని ప్రకటించారు. ఒక్కడే ఈ ఆత్మాహుతి దాడి చేసినట్లు అనుమానిస్తుండగా, ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు. ఇంకోవైపు బిలాల్ హత్యకు గురై 24 గంటలు గడుస్తున్నా కారణాలను మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more