ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. యూపీ ఆగ్రాలోని పాఠశాలలో పైశాచిక ఘటన చోటుచేసుకుంది. కస్గంజ్ ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న ఓ వివాహితపై విద్యార్థుల ఎదుటే దుశ్యాసన పర్వం జరిగింది. వివాహిత టీచర్ ను లొంగదీసుకోవాలని యత్నించిన మరో ఉపాధ్యాయుడిని అమె చెంపదెబ్బతో అవమానించడంతో ఏకంగా నలుగురు రౌడీలను వెనకేసుకుని వచ్చిన ఉపాధ్యాయుడు విద్యార్థులు వున్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయి అమె ఒంటిపై వేసుకన్న దుస్తులను తరగతి గదిలోనే చించివేసి ఘోరంగా అవమానించాడు.
వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని అగ్రాలో గల కస్గంజ్ ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న ఓ వివాహితపై అదే స్కూల్లో పనిచేస్తున్న జితేందర్ అనే ఉపాధ్యాయుడి కన్నుపడింది. జితేందర్ ఆ యువతిని కొద్దిరోజులుగా వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అమెను లొంగదీసుకుని తన వాంఛ తీర్చుకోవాలని భావించాడు. ఈ క్రమంలో ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళుతుండగా జితేందర్ ఆమెను అడ్డగించాడు. అమెతో అసభ్యపదజాలాన్ని వాడాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆ యువతి చెంపదెబ్బ కొట్టింది.
దీంతో అమెపై పగ పెంచుకున్న జితేందర్ ఆమెపై కసి తీర్చుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం స్కూల్లో క్లాస్ రూమ్లో పాఠాలు చెబుతున్న యువతిని అక్కడే దుస్తులు చించి అమానుషంగా ప్రవర్తించాడు. జితేందర్తో పాటు వెళ్లిన మరో నలుగురు కూడా ఆమెను విద్యార్థులందరి ముందూ క్లాస్రూమ్లో వేధింపులకు గురిచేశారు. వారి నుంచి తప్పించుకున్న ఆ యువతి స్టాఫ్ రూమ్ వైపుగా పరుగులు తీసింది. దీంతో జితేందర్ పరారయ్యాడు. జితేందర్ తన ఇంటి ఎదురుగా ఉంటాడని, తనకు పెళ్లయిందని చెప్పినా వినకుండా తరచూ వెంటపడి వేధిస్తున్నాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జితేందర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more