ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో మాజీ ప్రధాని, రాజ్యసభ సభ్యుడు మన్మోహన్ సింగ్ సందించారు. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా అప్పటి ప్రధాన మంత్రి హోదాలో తాను ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఆయన ఇవాళ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడుతూ.. రాష్ట్రానికి అన్యాయం జరగకూడదని ముందస్తుగా భావించిన తాము ఏపీకి పలు హామీలను ఇచ్చామని.. అవి సభ అమోదం కూడా పోందాయని చెప్పారు.
గత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై వుందన్నారు. హామీలు అమలు చేసి సభ గౌరవం కాపాడాలన్నారు. సభ ఇచ్చిన హామీలకు నాటి కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. తాను ప్రధానిగా హామీ ఇచ్చానని, వాటిని మీ ప్రభుత్వం అమలు చేయాలన్నారు. అప్పట్లో ఎన్నికల షెడ్యూల్ ఉన్నందున తాను ఇచ్చిన హామీల అమలు ఆగిపోయిందని చెప్పారు. నాటి ప్రభుత్వం చట్టసభల్లో ప్రకటించిన హామీలను నేటి ప్రభుత్వం విస్మరించడం తగదని, అలా అయితే పార్లమెంటుపై ప్రజలకున్న నమ్మకం పోతుందన్నారు.
వెంటనే బీజేపీ నాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చాలన్నారు. సభ్యుడి హక్కు కాలరాయడమే: కేవీపీ మాజీ ప్రధాని మన్మోహన్ మాట్లాడిన అనంతరం కేవీపీ సభలో మాట్లాడారు. తాను ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా బిల్లు పైన పదకొండు పార్టీలు మద్దతిచ్చాయని, వాటికి ధన్యవాదాలు అన్నారు. ప్రయివేటు బిల్లు సభ్యుడి హక్కు అన్నారు. ఏపీకి హోదా ఇచ్చేందుకు చట్టం అవసరం లేదన్నారు. బీజేపీ దీనిని రాద్దాంతం చేస్తోందన్నారు. తాను ప్రవేశ పెట్టిన బిల్లును మనీ బిల్లు అని చెప్పి బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్లును కాదనడం సభ్యుడి హక్కును కాలరాయడమే అన్నారు. ప్రయివేటు బిల్లు ద్రవ్య బిల్లు కాద్నారు. నాడు ప్రధాని హామీ ఇచ్చినందున ఏపీకి హోదా ఇచ్చేందుకు చట్ట సవరణ అవసరం లేదని చెప్పారు. ఏపీకి హోదా ఇవ్వకండా ఎన్డీయే ఈ అంశాన్ని సంక్లిష్టం చేస్తోందని మండిపడ్డారు. తాను ప్రవేశ పెట్టిన బిల్లు పైన ఓటింగ్ నిర్వహించాలని, డివిజన్ నిర్వహించాలని కేవీపీ చెప్పారు. ప్రయివేటు బిల్లును ఆమోదించిన తర్వాత ఆర్థిక బిల్లా కాదా తేల్చాలన్నారు. తన బిల్లుకు రాజ్యసభ సెక్రటరియేట్ అనుమతించిందిన్నారు. గతంలో ఈ బిల్లుపై కోరం వాయిదా పడిందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more