ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లివిరుస్తున్నాయి. టీడీపీ నిజస్వరూపం బయటపడిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రమంత్రి అయినంత మాత్రన ఆయన మూలాల మర్చిపోయి.. రాష్ట్రానికి చెందిన వ్యక్తినన్న విషయాన్ని కూడా మర్చిపోయారని అక్షేపిస్తున్నాయి. టీడీపీ మీడియా ముందు చేస్తున్న ప్రగల్భాలు ఒకలా వుంటే.. అసలు దాని నైజం భిన్నంగా వుందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మీడియా ముందు అంగలార్చుతున్న టీడీపీకి.. చిత్తశుద్దిని శంఖించాల్సి వస్తుందని కూడా విపక్షాలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా మండిపడుతున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, ఈ మేరకు కేంద్రం చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచందర్ రావు తెచ్చిన ప్రైవేటు బిల్లుపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక స్థాయిలో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ కు రాజ్యసభ డిఫ్యూటీ చైర్మన్ కురియన్ కు మద్య తీవ్రస్థాయిలో వాగ్వాదం కూడా జరిగింది. కేవీపీ ప్రవేశపెట్టింది ద్రవ్య బిల్లు కాదని, దీనిపై చర్చ జరగాలని, అనాటి రాష్ట్ర పునర్విభజన ఘట్టంలో జరిగిన పరిణామాలను కూడా జైరాం రమేష్ ఊటంకిస్తుండగా, దానిని కురియన్ అడ్డుకున్నారు. దీనిపై ఓటింగ్ కోసం పట్టుబడుతుండగా పార్టీలకు అతీతంగా దానికి మద్దతివ్వాల్సిన టీడీపీ అందుకు భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. బిల్లు ఆర్థిక బిల్లని దానిపై లోక్ సభోలోనే ముందుకు వెళ్లాలని అరుణ్ జైట్లీ చెప్పగానే కాంగ్రెస్ సభ్యులు మూకుమ్మడిగా ఖండిస్తుండగా ఆ బిల్లుపై నిర్ణయాన్ని లోక్ సభకు స్పీకర్ కురియన్ వదిలేశారు.
కేవీపి పెట్టింది ఆర్థిక బిల్లా కాదా అనే విషయం లోక్ సభ స్పీకర్ తేలుస్తారని కురియన్ రూలింగ్ ఇవ్వగానే కేంద్ర మంత్రి సుజనా చౌదరీ చక్కగా చప్పట్లు కొట్టేశారు. సుజనా చౌదరి చప్పట్టు కొట్టగానే కాంగ్రెస్, వైసీపీ సహా పలు విపక్ష పార్టీలు విస్తుపోయాయి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న చర్చలో సుజనా ఎందుకు విరుద్ధంగా వ్యవహరించారని అశ్చర్యానికి గురయ్యాయి. నిన్నటి వరకు కేవీపీ బిల్లుకు మద్దతిస్తామని ప్రకటించిన సుజనా అనూహ్యంగా చేసిన ఈ వింత ప్రవర్తన పలువురికి ఇబ్బంది కలిగించింది. బీజేపీ సభ్యులతో కలిసి బల్లలు చరుస్తూ సుజనా చౌదరి ఉత్సాహంగా కనిపించారు. దీంతో ఆయన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. హోదా విషయంలో ఎటూ తేల్చని బీజేపీ సభ్యులతో ఆయన జతకట్టడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఓ పక్క బిల్లుపై ఓటింగ్ కోసం నిరసన చేపడుతుండగానే టీడీపీ ఎంపీలంతా తమకు ఏమీ పట్టనట్లు సభ నుంచి వెళ్లడం కూడా విమర్శలకు తావిచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more