గువాహటి లో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు గాల్లో ఢీకొనబోయి చివరి నిమిషంలో తప్పించుకోవడంతో అందులోని ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది సైతం ఊపిరి పీల్చుకున్నారు. గువాహటిలో ఒకదానికొకటి ఎదురుగా వచ్చిన ఈ విమానాలు వెంటుక్రవాసిలో ఢీకొనేముప్పును తప్పించుకున్నాయి. అయినప్పటికీ ఒకదానికొకటి రాపిడి చేసుకోవడంతో రెండు విమానాల్లోని ప్రయాణికులు బెదిరిపోయారు. దాదాపు నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. వారికి వెంటనే వైద్య సహాయం అందించినట్టు అధికారులు తెలిపారు.
ఈ ఘటన క్రితం రోజు సాయంత్రం గువాహటిలోని లోకప్రియ గోపినాథ్ బోర్డోలోయ్ విమానాశ్రయంలో జరిగింది. ముంబై నుంచి గువాహటి వస్తున్న ఇండిగో విమానం ల్యాండ్ కావడానికి సిద్ధమవుతుండగా.. అదే సమయంలో చెన్నై వెళ్తున్న మరో ఇండిగో విమానం టేకాఫ్ అయింది. మొదటి విమానం దిగాల్సిన దారిలోనే ఆ విమానం వెళ్లింది. గగనతలంలో సంభవించిన ఈ ఊహించిన ప్రమాదంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో రెండు విమానాల్లోని ప్రయాణికులు తమ కళ్లు తిరిగి.. అస్వస్థతకు గురైనట్టు అనిపించిందని ఫిర్యాదు చేశారని, క్యాబిన్ సిబ్బందికి వెంటనే వైద్య సహాయం అందించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
పరిణామాన్ని ఊహించిన ఫైలట్లు అప్రమత్తతతో వ్యవహరించడంతో కొన్ని సెకన్ల తేడాలో ప్రమాదం తప్పింది. అయితే నలుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఈ షాక్ నుంచి తేలుకోలేకపోయారు. భారీ వర్షాల కారణంగా గువాహటి వస్తున్న విమానం 250 నుంచి 300 అడుగుల ఎత్తులోనే ఎగురుతున్నదని, అదే సమయంలో చెన్నై వెళ్లాల్సిన విమానం టేకాఫ్ కావడంతో ఈ గందరగోళం నెలకొన్నదని ఇండిగో అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే చివరికి ఆ విమానం సురక్షితంగా ల్యాండైందని తెలిపారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more