మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చట్టం కోసం ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 123ని హైకోర్టు కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేయనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 123 జీవో ద్వారా అందే పరిహారం గురించి న్యాయస్థానంలో మరింత సమర్థవంతంగా వాదనలు వినిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా 123 జీవో ప్రకారం ప్రభుత్వం నేరుగా భూములను సేకరిస్తోందంటూ, దీని వల్ల తమకు అన్యాయం జరుగుతోందంటూ మెదక్ జిల్లా భూనిర్వాసితులు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. పిటిషనర్లతో ఏకీభవించిన హైకోర్టు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే రైతుల నుంచి భూసేకరణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 123 జీవోతో పాటు 124 జీవోను కూడా కొట్టి వేసింది. 2013 చట్టాన్ని ఉపయోగించకుండానే ప్రాజెక్టులు మొదలు పెడదామనుకున్న తెలంగాణ సర్కార్కి హైకోర్టు తీర్పు పెద్ద దెబ్బే తగిలినట్లయ్యింది.
రైతుల నుంచి నేరుగా భూమిని సేకరించేందుకు ఏర్పాటు చేసిన జీవోలో అనేక లోపాలున్నట్లు రైతులు హైకోర్టుకు విన్నవించారు. దీంతో ఏకీభవించిన ధర్మాసనం 123 జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోలో కేవలం రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతోందని.. వాస్తవానికి రైతులతో పాటు రైతు కూలీలకు కూడా నష్టం పరిహారం చెల్లించాలని హైకోర్టు సూచించింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తాజా తీర్పుతో మల్లన్నసాగర్ సహా పలు ప్రాజెక్ట్ల భూసేకరణపై ప్రభావం పడనుంది.
కాగా, 123 జీవోను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు బాణాసంచా కాల్చి, స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం రైతుల పక్షాన లేకున్నా, న్యాయస్థానం రైతుల పక్షాన నిలిచిందని వారు పేర్కొన్నారు. జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి నేతలతో సహా జేఏసీ నేత కోదండరాం కూడా కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more