ఢిల్లీలోని తన ప్రభుత్వాన్ని కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ ముప్పు తిప్పలు పెడుతూ.. ప్రతీ పనిలోనూ అడ్డుకుంటుందని, తమ పార్టీ శాసనసభ్యులను కూడా అకేక ఇబ్బందుల పాలు చేస్తూ,, కేసులు బనాయిస్తుందని అరోపిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని అప్ ప్రభుత్వానికి క్రేజ్ పెరుగుతుంది. ఇన్నాళ్లు కమలం గూటికి చెందిన నేతలను టార్గెట్ చేస్తూ వచ్చిన అప్ నేతలకు రెండేళ్ల తరువాత శుభ గడియలు వచ్చాయా..? అన్నట్లుగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండేళ్ల క్రితం వినిపించిన నమో మంత్రం.. ఇప్పుడు వినిపించినా.. దాన్ని ఆ పార్టీకి చెందిన నేతలే విస్మరిస్తున్నట్లు కనిపిస్తుంది.
ప్రధాని నరేంద్ర మోడీ సహా ఆయన ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పించే అరవింద్ కేజ్రీవాల్ పంచన చేరేందుకు కాషాయ నేతలే వలసలు కడుతున్నారు. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ నుంచి కేవలం ఢిల్లీలో మాత్రమే అధికారంలో వున్న అమ్ ఆద్మీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నిన్నటికి నిన్న రెండు నెలల క్రితం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన బీజేపి సీనియర్ నేత, క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కాగా తాజాగా మరో బీజేపీ ఎంపీ సతీమణి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవలి పార్టీ బహిష్కరణకు గురైన బీజేపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ భార్య పూనమ్ ఝా ఆప్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా డీడీసీఏ (ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అక్రమాల వ్యవహారంలో సొంత పార్టీకి చెందిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై కీర్తి ఆజాద్ బహిరంగంగా విమర్శలు చేయటంతో ఆయనపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తన భార్య బీజేపీని వీడి ఆప్లో చేరనున్నట్లు వచ్చిన వార్తలను కీర్తీ ఆజాద్ ఖండించలేదు. పైగా తన భార్య నిర్ణయంపై మీడియా విపరీత అర్థాలు తీయవద్దన్నారు. పార్టీ మారటం అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయమని ఆయన తెలిపారు. కాగా నవ్జోత్ సింగ్ సిద్ధూ ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వంతో పాటు బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన భార్య నవ్జోత్ కౌర్ సిద్ధూ మాత్రం తాను బీజేపీలోనే ఉన్నారు. తాజాగా కీర్తీ ఆజాద్ బీజేపీలో ఉండగా, ఆయన భార్య మాత్రం ఆప్లో చేరబోతుండటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more