ఆధునిక కాలంలో పంచాయితీ పెద్దలు అనాగరిక చర్యకు దిగారు. శ్రీకాకుళం జిల్లా దుక్కివానిపేటలో ఓ కుటుంబానికి సాంఘిక బహిష్కరణ విధించడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యపై నమ్మకం లేని ఓ తల్లి తన పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్పించినందుకు ఆ గ్రామ పెద్దలు వెలివేశారు.
వివరాళ్లోకి వెళ్లితే... పల్లెల్లో స్కూలు, లేదా హాస్టల్ నిర్వహించాలంటే కనీస విద్యార్థుల సంఖ్యను ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతకంటే కంటే తక్కువ మంది విద్యార్థులుంటే ఆ స్కూలు, లేదా హాస్టల్ ను రద్దు చేస్తుంది. దీంతో తమ గ్రామంలో విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని భావించిన దుక్కివానిపేట గ్రామ పెద్దలు గ్రామ బాలలంతా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యనభ్యసించాలని నిబంధన పెట్టారు. భర్త విదేశాల్లో ఉండటంతో ఇద్దరు పిల్లలతో ఊళ్లో ఉంటున్న సుజాత అనే మహిళ ప్రభుత్వ స్కూళ్లలో పర్యవేక్షణ ఉండదని భావించి తన పిల్లలకు మంచి విద్యనందించాలన్న ఉద్దేశంతో దగ్గరలో ఉన్న పలాసలోని ఓ ప్రవేట్ స్కూలులో చేర్పించింది. దీంతో ఆమెను పంచాయతీ పెద్దలు మందలించారు.
ఇలాంటి నిర్ణయం వల్ల మిగతా వారు కూడా అదే మార్గంలో పయనిస్తారని, తద్వారా గ్రామం నుంచి స్కూలు తరలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య లభించదని చెప్పిన సుజాత తన నిర్ణయం మార్చుకునేందుకు అంగీకరించలేదు. ఆమె కుటుంబానికి సాంఘిక బహిష్కణ శిక్ష విధిస్తున్నట్టు పంచాయతీ ప్రకటించింది. ఆ కుటుంబ సభ్యులతో ఎవరైనా మాట్లాడితే, వారికి 500 రూపాయల జరిమానా విధిస్తామని ప్రకటించింది. దీంతో ఆమె పోలీసులతోపాటు తహసీల్దార్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more