బ్యాంకులన్నింటికి పెద్దగా ఉండటంతోపాటు దేశ ఆర్థిక లావాదేవీలు అంశాలను శ్రద్ధతో చూసుకుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). దేశంలోని పలు ప్రాంతాల్లో బ్రాంచీలను ఏర్పాటు చేసుకుని మింట్ కాంపౌండ్ల సహయంతో కరెన్సీ ముద్రణ బాధ్యతను కూడా భుజస్కందాలపై వేసుకుంది. ఏ మాత్రం చిన్న పోరపాటు జరిగినా సరే దేశ ఆర్థిక వ్యవస్థపై అది తీవ్ర ప్రభావం చూపుతుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటిది జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అధికారులు చిన్నపాటి నిర్లక్ష్యం వహించటంతో పెద్ద తప్పిదమే జరిగిపోయింది.
సాధారణంగా ఆర్బీఐ కరెన్సీ నోట్లు ముద్రించే సమయంలో ఆ నోట్లు చెలామణిలోకి వచ్చిన సంవత్సరాన్ని పేర్కోంటాయి. అయితే తమిళనాడులో మాత్రం ఓ రెండేళ్ల తర్వాత అంటే 2018 లో రావాల్సిన 500 రూపాయల నోట్లు ప్రస్తుతం చెలామణి అవుతున్నాయి. చెన్నైలోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ జర్నలిస్ట్ ఈ విషయమై అధికారులను ప్రశ్నించాడు. 2018లో విడుదల కావాల్సిన రూ.500 నోట్లు అప్పుడే చెలామణిలోకి వచ్చాయా అంటూ ఓ నోటును అధికారులకు చూపాడు. అయితే షాక్ తిన్న అధికారులు అది తాము ప్రింట్ చేసిందే అని నిర్ధారించుకున్నారు.
అయితే దీనిపై తమకు ఇప్పటిదాకా ఫిర్యాదు అందలేదని చెప్పిన సదరు ఆర్బీఐ అధికారి, విచారణకు మాత్రం ఆదేశించినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా సదరు వ్యవహారంపై సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారట. దేశంలో పెద్ద ఎత్తున చెలామణి అవుతున్న దొంగ నోట్లలోనే ఆయా నోట్లు కూడా కలిసిపోయాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళనాట వెలుగుచూసిన ఓ ఘటన అటు ఆర్బీఐ అధికారులతో పాటు ఇటు సాధారణ జనాలను కూడా బెంబేలెత్తిస్తోంది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more