ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్రమంత్రి హెచ్బీ చౌదరి చెప్పడం ఏమాత్రం సబబు కాదని వైఎస్ఆర్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి ప్రధాని మన్మోహన్సింగ్ స్పెషల్ స్టేటస్పై రాజ్యసభలో మాటిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు, రీ ఆర్గనైజేషన్ యాక్ట్లో పొందు పర్చలేదని చెప్పడం పద్ధతి కాదని మేకపాటి అన్నారు. పునర్విజన బిల్లులో ఆ అంశాన్ని పోందుపర్చలేదని చెబుతున్న బీజేపి నేతలు అప్పుడు రాష్ట్రానిక ప్రత్యేక హాదా కావాలంటే తమకు ఓటు వేయాలని ఎన్నికలలో ఎలా ప్రచారం చేశారని ఆయన నిలదీశారు, ప్రత్యేకహోదాపై కేంద్రం మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే ఏపీకి నష్టం జరుగుతోందని మేకపాటి అన్నారు.
కేంద్ర మంత్రి హెచ్ బి చౌదరి ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక చీకట్లో మగ్గిపోవాల్సిందేనని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, హీరో శివాజీ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదంటూ ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి పేర్కొన్న విషయమౌ ఆయన స్పందిస్తూ, తెలుగు కేంద్ర మంత్రులు కేంద్రంలో కార్పొరేట్ పైరవీల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన కేంద్రమంత్రులకు సన్మానం చేయాలంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఆ తరువాత ఓ టీవీ ఛానెల్ తో ఫోన్ లో సంభాషించిన ఆయన రాష్ట్ర బీజేపి నేతలను సన్నాసులని తిట్టేసారు.
ఇవాళ ఈ విషయమై చూడాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్య వైఖరి వల్లే పరిస్థితి ఇలా తయారైందని ఆయన విమర్శించారు. ‘అమ్మ పెట్టదు, అడక్కుతిననివ్వదని’. కేంద్రం ఆంధ్రప్రదేశ్ పట్ల ఎలా వ్యవహరిస్తున్నదీ సాక్షాత్తూ ప్రభుత్వంమే చెప్పింది. ఇవాళ, సన్నాసి మంత్రెవడో ఒకడు చెప్పాడని చెప్పి, ఆ వెధవకు తెలియదేమో.. 14వ ఆర్థిక సంఘం.. బీజేపీ సన్నాసుల్లారా ఒకసారి వినండి..14వ ఆర్థిక సంఘం బీహార్ కు లక్షా అరవై వేల కోట్లు ఇవ్వమందా సన్నాసుల్లారా? మీరు మనుషులేనా?’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు నోరుమెదపట్లేదు’ అని నాటి విషయాలను హీరో శివాజీ ప్రస్తావించారు.
ఏపీకి ప్రత్యేకహోదా విషయమై వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, రాష్ట్రానికి చెందిన మిగిలిన బీజేపీ నేతలు, మంత్రులు అసలు ఏం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ‘మనసువిప్పి పోరాటానికి సిద్ధంకండి, ప్రత్యేకహోదా ఎందుకు రాదో తేలుద్దాము. ప్రత్యేకహోదాపై నోటిమాట కన్నా బిల్లులో పెట్టేసి ఉంటే ఈ దరిద్రం ఉండేది కాదు కదా? ఏపీ ప్రత్యేక హోదాపై ఒక్క చంద్రబాబు నాయుడు తప్పా, మిగిలిన మంత్రులెవ్వరూ మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు బీజేపీతో తెగతెంపులు చేసుకోండి. ఏపీ నుంచి వెళ్లిన బీజేపీ నాయకులు వాళ్ల వ్యాపారాలు, లావాదేవీలు తప్పా ఏపీ ప్రజల గోడు పట్టించుకోవట్లేదు’ అని శివాజీ మండిపడ్డారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more