రైలు ప్రయాణాలంటే వణుకు పుట్టించే పరిస్థితుల నుంచి సుఖవంతమైన ప్రయాణాలుగా క్రమంగా మారుతూ ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందించే దిశగా మారింది. సుదూర ప్రయాణాలకు పేద, బడుగు వర్గాలకు సౌకర్యవంతమైన, అనువైనదిగా మారడంతో రోజురోజుకీ దేశ ప్రజల ఆదరణ పెంచుకుని ముందుకు పోతుంది, ప్రతీ రైలులోనూ రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, రైల్వే పోలీసులు పహారా కాస్తూ.. ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాలుగా మారుస్తుంది.
అయితే గత కొంత కాలంగా మళ్లీ రైళ్లలో దోపిడీ దోంగలు విభృభిస్తున్నారు. ఇటీవల ఓ ఐపీఎస్ అధికారిపైనే దాడికి పాల్పడి అమె వస్తువులను తస్కరించిన దొంగలు.. ఆ తరువాత అనేక రైళ్లోలో ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నారు. మొన్న ప్రకాశం జిల్లా, నిన్న కడప జిల్లా... ఆ తరువాత చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో శనివారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. రైలు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల వద్దకు రాగానే గుర్తుతెలియని దుండగులు చైన్ లాగి రైలును నిలిపి వేసి దోపిడీకి యత్నించారు. వీరిపై రైల్వే పోలీసులు ఒక రౌండ్ కాల్పులు కూడా జరిపారు,
దీంతో ఇక రైళ్లలో దోంగల అలజడి తగ్గుతుందని భావించిన పోలీసులకు మరో సవాల్ విసిరారు, ఆంద్రప్రదేశ్ కు బదులు ఇటు మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో హల్ చల్ చేశారు, ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు పరిధిలో నేటి తెల్లవారుజామున నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో చోరీ జరిగింది. అప్పటికే రైల్లోకి ఎక్కిన దొంగలు దెందుకూరు వద్దకు రాగానే చైన్ లాగి రైలును ఆపేసిన దొంగలు ఇద్దరు మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాగేశారు. ఆ తర్వాత వెనువెంటనే రైలు దిగేసి, క్షణాల్లో మాయమయ్యారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more