Police open fire as robbers strike Secunderabad bound Narayanadri Express

Robbery attempt in narayanadri express

Robbery Attempt in Narayanadri Express, Narayanadri Express, Ongole railway station, Prakasam district, rpf police firing

Robbers stuck two coaches of Narayanadri Express near Ongole railway station in Prakasam district in the early hours of Saturday.

నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ లో దోపిడీకి దోంగల యత్నం..

Posted: 04/09/2016 10:27 AM IST
Robbery attempt in narayanadri express

రైలు ప్రయాణాలంటే వణుకు పుట్టించే పరిస్థితుల నుంచి సుఖవంతమైన ప్రయాణాలుగా క్రమంగా మారింది. ప్రతీ రైలులోనూ రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, రైల్వే పోలీసులు పహారా కాస్తూ.. ప్రయాణికులకు సుఖ ప్రయాణాలు, సౌకర్యవంతమైన ప్రయాణాలను అందించారు. అయితే గత కొంత కాలంగా మళ్లీ రైళ్లలో దోపిడీ దోంగలు విభృభిస్తున్నారు. ఇటీవల ఓ ఐపీఎస్ అధికారిపైనే దాడికి పాల్పడి అమె వస్తువులను తస్కరించిన దొంగలు.. ఆ తరువాత అనేక రైళ్లోలో ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నారు.

మొన్న ప్రకాశం జిల్లా, నిన్న కడప జిల్లా... తాజాగా చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. రైలు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల వద్దకు రాగానే గుర్తుతెలియని దుండగులు చైన్ లాగి రైలును నిలిపి వేసి దోపిడీకి యత్నించారు. ఇద్దరు మహిళలను బెదిరించి వారి నుండి బంగారు అభరణాలను దొంగలించిననట్లు సమాచారం,

వెంటనే అప్రమత్తమైన సహ ప్రయాణికులు సహ ప్రయాణికులు అప్రమత్తయ్యారు. వెంటనే అక్కడకు రైల్వే పోలీసులు దుండగులపై మూడు రౌండ్‌లు కాల్పులు జరిపారు. దీంతో దుండగులు రైల్లో నుంచి దూకి పరారయ్యారు. బాధితులు సికింద్రాబాద్‌ వాసులుగా గుర్తించారు. ఎస్ 13 బోగీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో దోపిడీ జరిగిన విషయమై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని  రైల్వే పోలీసులను తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles