కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు ప్రయత్నాలు మొదలుపెట్టడంతో ఆశావహుల్లో సందడి మొదలైంది. ఏపీ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్న గుంటూరు జిల్లాలో కొత్త నియోజకవర్గాలు ఎక్కడ రాబోతున్నాయి.. ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై చర్చలు జోరందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయన్న వార్త రావడంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం నవ్యాంధ్రలో కొత్తగా 50 నియోజకవర్గాల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాబోయే కాలంలో పార్లమెంటు సమావేశాల్లో సవరణ బిల్లు పెట్టి ఆమోదం పొందేందుకు కేంద్ర సర్కారు సన్నాహాలు చేస్తోంది. దీంతో 2019 ఎన్నికల నాటికే రాష్ట్రంలో కొత్త నియోజకవర్గాలు రూపుదాల్చే అవకాశముంది.
జనాభా దామాషా ప్రకారం ప్రతి రెండు లక్షలా 19 వేల జనాభాకు ఒక నియోజకవర్గం ఏర్పాటు కానుంది. దీని ప్రకారం గుంటూరు జిల్లాలో కొత్తగా ఐదు నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 22కు చేరుతుంది. 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కారణంగా అప్పటి వరకు జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాలను కుదించి 17కు చేర్చారు. దుగ్గిరాల, కూచినపూడి నియోజకవర్గాలు రద్దయ్యాయి. అప్పటివరకు నాన్ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న ప్రత్తిపాడు ఎస్సీ కేటగిరీలోకి వెళ్లింది. ఇదిలా ఉంటే త్వరలో జరగనున్న అసెంబ్లీ స్థానాల పెంపుతో లోక్సభ నియోజకవర్గాల స్వరూపమే మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కో లోక్సభ స్థానంలో 9 అసెంబ్లీ స్థానాలు ఉండే విధంగా పునర్విభజన చేయనున్నారు. ప్రస్తుతం ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో 7 నియోజకవర్గాలు ఉండగా అదనంగా రెండు అసెంబ్లీ స్థానాలు కలవనున్నాయి. కొత్తగా ఏర్పడే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి గుంటూరు సెంట్రల్ నియోజకవర్గంగా మిగతా 4 పిడుగురాళ్ళ, చెరుకుపల్లి, పెదకాకాని, నకరికల్లు కేంద్రాలుగా ఏర్పడే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more