బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుని ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా మారి దేశం వదలి పారిపోయాడన్న అరోపణలను మూటగట్టకున్న వ్యాపారవేత్త విజయ్మాల్యా ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. ముంబైలోని మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ హౌస్ ఆన్ లైన్లో వేలానికి పెట్టిన ఎస్బీఐ వేలాన్ని ముగించింది. అంధేరిలోని 2,401.70 చదరపు మీటర్లు ఉన్న ఈ ప్రాపర్టీకి రిజర్వు ధరగా రూ. 150 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం గురువారం ఈ బంగ్లాను ఆన్లైన్లో వేలం వేయనున్నట్లు ముందుగానే ప్రకటించింది
కాగా, ఈ ఈ-వేలంలో పాల్గొనేవాళ్లు రూ. 5 లక్షలు చెల్లించి, రూ. 15 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ వేలానికి కొనుగోలు దారుల నుంచి ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడంతో, ఎస్బీఐ వేలం ప్రక్రియ ముగిసినట్టు ప్రకటించింది. ఇక దీంతో పాటు గోవాలోని కింగ్ఫిషర్కు చెందిన విల్లాను కూడా బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి. ఈ విల్లాకు రూ. 90 కోట్లు ధర పలుకుతుందని భావిస్తున్నారు. అయితే తొలిసారిగా కేవలం ముంబైలోని ఇంటిని వేలం వేయగా, ఒక్క బిడ్డు దాఖలు కాకపోవడంతో బ్యాంకర్లు ఆశలు అడియాశలయ్యాయి.
విజయ్మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సంస్థ బ్యాంకుల నుంచి రూ. 6,963 కోట్లు రుణాలు తీసుకొని.. ఎగ్గొట్టింది. ప్రస్తుతం కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ దివాళాతీసి మూతపడటంతో గత ఏడాది దానికి చెందిన ఈ భవనాన్ని ఎస్బీఐ స్వాధీనం చేసుకుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకుగాను కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్తోపాటు విజయ్మాల్యా, ఆయనకు చెందిన యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ కూడా పూచికత్తు దారులుగా ఉన్నాయి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more