ఏపికి విభజన తర్వాత సరైన న్యాయం జరగలేదు అన్న గొంతుకలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిన్న పార్లమెంట్ లోని ఉభయసభల్లో ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని కాంగ్రెస్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దాంతో మరోసారి ఏపి ప్రత్యేక హోదా అంశం తెర మీదకు వచ్చింది. కాగా ఇప్పటి దాకా ప్రత్యేక హోదా దక్కలేదు. విభజన హామీలు నెరవేరట్లేదు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు రావట్లేదు. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెంచే యత్నం చేస్తోంది ఏపీ సర్కార్. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీల్ని అమలు చేయాలని కోరుతూ నేడు అసెంబ్లీలో తీర్మానం చేయనుంది. ఈ మేరకు టీడీఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కేంద్రానికి అప్పగించాలని కూడా యోచిస్తున్నారు.
2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలనేది చంద్రబాబు ధ్యేయం. అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగేళ్లు అన్న చంద్రబాబు ఏడాది నుంచి మూడేళ్లలో పూర్తిచేస్తామని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో ఉన్న ముంపు మండలాల్ని ఏపీలో కలిపేలా, అలానే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించేలా చేయడంలోనూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయ్యారు చంద్రబాబు. కానీ పోలవరం ప్రాజెక్టుకు నిధులు సాధించుకోవడంలో విఫలమయ్యారు.
విభజన చట్టం హామీలు అందునా ముఖ్యంగా ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు సాధించే క్రమంలో విమర్శలు ఎదుర్కొంటున్న టీడీపీ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. కేంద్రం సహాయంలేనిదే పోలవరం పూర్తిచేయడం అసాధ్యమైన తరుణంలో ఆ క్రెడిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని చెబుతోంది. భూ సమీకరణ, ఇతర అంశాల బాధ్యతను తమ అధీనంలో ఉంచుకుంటూ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని కేంద్రానికే అప్పగించేందుకు సై అంటున్నారు చంద్రబాబు. పోలవరం ఒక్కటే అని కాదు విభజన చట్టంలోని హామీల్ని నెరవేర్చేలా నేడు అసెంబ్లీలో తీర్మానం చేయనుంది టీడీపీ సర్కార్. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపి మోదీ సర్కార్-పై ఒత్తిడి పెంచనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more