కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే అయనకు పద్మ పురస్కారంతో సత్కరించాలనుకుంది. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తగానే.. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న కేంద్రం.. మొత్తానికి బీజేపి అధికారంలో వున్న రాష్ట్రాల్లో మాత్రం ఆయన పట్ల భక్తిని చాటుకుంటుంది. హర్యానా రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా ఆయనను సత్కారించిన హర్యానా ప్రభుత్వం.. ఆయనకు వందల ఏకరాలను దారాదత్తం చేసింది. ఆయన పతాంజలి సంస్థ తయారు చేయు ఔషధ మొక్కలు పెంపకానికని మరీ ప్రకటించారు. హర్యానా తరువాత ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన పట్ల స్వామి భక్తిని చాటుకుంది. ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా ఎవరి కోసమో తెలుసా..?
యెగాగురు బాబా రాందేవ్ గురించి. ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వం 600 ఎకరాల భూమిని ఆయనకు తాజాగా ధారాదత్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న 'పతంజలి యోగపీఠ్ ' సంస్థకు ఈ స్థలాన్ని కేటాయించింది. ఆయుర్వేద మందుల తయారీకి పయోగించే ఔషధ మొక్కల పెంపకానికి అవసరమైన ప్రాసెసింగ్ ప్లాంట్ కోసం ఈ భూమిని వినియోగించనున్నారు. నాగ్పూర్ ఎంపీ, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్రమంత్రి చంద్రశేఖర్, యోగపీఠ్ ప్రతినిధులు సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. నాగపూర్ జిల్లా కోటాల్ లో 200, ప్రాసెసింగ్ ప్లాంట్ కోసం మిహాన్ సెజ్లో మరో 450 ఎకరాల భూమిని రాందేవ్ బాబాకు అప్పగించారు.
ప్రకృతి వనరులు, మందుల వినియోగంపై పరిశోధన కోసం ఈ భూమిని బాబాకు కేటాయించామని కేంద్ర మంత్రి ప్రకటించారు. దీనిద్వారా మావోయిస్టుల ప్రభావిత జిల్లా గడ్చిరోలిలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయన్నారు. ముఖ్యంగా విదర్భలోని గిరిజన ప్రాంతాలు, రిమోట్ భూభాగాల్లో విస్తారంగా కనిపించే సహజ మందులు, వాటి మూలాలపై పరిశోధనకు ఈ భూమి ఉపయోగిస్తారని తెలిపారు. అయితే వివాదాస్పద యోగా గురుకు వందల ఎకరాల స్థలాలను కట్టబెట్టడంపై విమర్శలు చెలరేగాయి. భారీ పెట్టుబడులకు ఉద్దేశించిన సెజ్ భూమిని ఇలా బాబాలకు ఇవ్వడమేంటని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వానికి నిజంగా అటవీ ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశముంటే టెండర్లను ఎందుకు పిలవలేదని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అటవీ భూములను అన్యాక్రాంతం చేయడానికి బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగా ఈ కేటాయింపులు చేశారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఆరోపించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more