హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ యువ మేధావి రోహిత్ వేముల మరణంపై మూడు రోజుల తరువాత స్పందించిన కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరాని అగ్గిరాజేశారు. అమె క్రితం రోజు సాయంత్రం చేసిన వ్యాఖ్యలతో విభేదిస్తున్న దళిత ప్రోఫెసర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని వాస్తవ పరిస్థులను తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు మానుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరాని వ్యాఖ్యలను తాము తీవ్రంగా నిరసిస్తున్న ఫ్రోపెసర్లు స్పష్టం చేశారు. అమె వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిపాలనా బాధ్యతల నుంచి తప్పుకుని కేవలం అధ్యాపక బాధ్యతల్లో మాత్రమే కోనసాగుతామని ప్రకటించారు. వర్సిటీ బోర్డులో దళిత ఫ్రోఫెసర్లు వున్నారని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదంటున్నారు. వర్సటీ చరిత్రలో ఇప్పటివరకు దళిత ప్రోఫెసర్ ఒక్కరికి కూడా బోర్డులో స్థానం లభించలేదని వారు పేర్కోన్నారు.
విద్యార్థులను సస్పెండ్ చేసిన కమిటీలో వున్న దళిత ప్రోఫెసర్లు వున్నారని వారే విద్యార్థులను సస్పెండ్ చేశారని కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా సత్యదూరమని వారు చెప్పారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా కేంద్ర మంత్రి హోదాలో తప్పులను.. ఒప్పులుగా చేస్తూ, స్మృతి ఇరానీ వ్యాఖ్యాలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదిలావుండగా, రోహిత్ కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని ఈ నెల 25న యూనివర్శిటీ జేఏసీ 'ఛలో హెచ్ సీ యు' కు పిలుపు నిచ్చింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more