నేతాజీ సుభాష్చంద్రబోస్ మృతికి సంబంధించిన కీలక సమాచారాన్ని బ్రిటన్కు చెందిన ఓ సైట్ పొందుపర్చింది. నేతాజీ చివరి రోజులకు సంబంధించిన వివరాల పట్టినకను వెబ్సైట్లో పోస్ట్ చేశారు. ప్రత్యక్ష సాక్షులప్రకారం 1945 ఆగస్టు 18న తైవాన్ విమానం కూలిన ఘటనలో నేతాజీ మరణించినట్టు వెబ్సైట్ పేర్కొంది. ఈ విషయాన్ని ఆనాడు ప్రత్యక్షంగా చూసినవారితోపాటు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన ఇద్దరు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపిన వివరాల ఆధారంగా నేతాజీ విమానం కూలిన ఘటనలోనే మృతిచెందారని పేర్కొంది. అంతేకాదు చనిపోతూ చివరిగా చెప్పిన మాటలు ఆయన భారతదేశం స్వేచ్ఛా స్వాతంత్య్ర కాంక్షను తెలియజేస్తున్నాయని వెబ్సైట్ తెలిపింది.
విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బోస్ తన చివరి సందేశాన్ని భారత ప్రజలకు చేరవేయాలని కర్నల్ రహ్మాన్ను కోరారు. మీరు భారత్కు తిరిగి వెళ్లినప్పుడు నా కొనప్రాణం వరకు దేశం కోసమే పోరాడానని ప్రజలకు చెప్పాలి. స్వాతంత్య్రం కోసం పోరాటాన్ని కొనసాగించాలి. హిందుస్థాన్కు స్వాతంత్య్రం వస్తుంది. భారతీయులు ఎంతో కాలం బానిసలుగా ఉండరు అని అన్నారు. విమానం ప్రమాదం తర్వాత మొదటిసారి బోస్ను చూసినప్పుడు దుస్తులు మంటల్లో కాలిపోతుండగా అతని సహాయకుడు రహ్మాన్ విప్పే ప్రయత్నం చేస్తున్నాడని బోస్తోపాటు ప్రయాణించిన లెఫ్టినెంట్ కర్నల్ శిరో నోనోగాకి పేర్కొన్నారు. అయితే తీవ్రంగా గాయపడ్డ నేతాజీని స్థానిక నాన్మోన్ మిలిటరీ దవాఖానలో చేర్పించారని మరో కథనం ఉంది. ఇది సెప్టెంబర్ 1945లో చోటుచేసుకున్నట్టు సమాచారం. నేతాజీ కోసం అప్పట్లో భారత్లోని బ్రిటిష్ అధికారులు హెచ్కే రాయ్, కేపీ డీ నేతృత్వంలోని బృందాన్ని బ్యాంకాక్, సైగోన్, తైపేకి పంపించింది. బోస్ ఎక్కడున్నారో తెలుసుకోవాలని, వీలైతే అరెస్ట్ చేయాలని ఈ బృందం ప్రయత్నించగా, విమాన దుర్ఘటనలో బోస్ చనిపోయినట్టు తెలియడంతో వారు తిరిగి వచ్చారు.
బోస్ గురించి ఆ వెబ్ సైట్ లో మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ http://www.bosefiles.info/ చేయండి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more