దొరికితే దొంగ లేదంటే దొర అని మన పెద్ద వాళ్లు సామెత చెబుతూ ఉంటారు. అయితే దొంగలే దొరలుగా మారుతున్నారు... లేదంటే దొరలుగా మారిన తర్వాత దొంగబుద్దులు వస్తున్నాయో అర్థంకావడం లేదు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దగ్గరి నుండి కళానికేతన్ లీలాకుమార్ వరకు అందరూ ఒకటే పాలసీని ఫాలోఅవుతున్నారు. బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల నుంచి భారీగా గుంజాడు.. కళానికేతన్ ఎండీ లీలా కుమార్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు రూ.800 కోట్ల మేర ఇలా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. అప్పులు తీసుకోవడమే తప్ప.. వాటిని తిరిగి చెల్లించలేదు. హైదరాబాద్ కు చెందిన ఏవీఎన్ రెడ్డి దగ్గర 3 కోట్లు అప్పుగా తీసుకున్నారు లీలాకుమార్, అతని భార్య శారద. కళానికేతన్ లో భాగస్వామ్యం ఇస్తామంటూ ఆయన్ను నమ్మించారు. కానీ.. ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా డబ్బు ఇవ్వలేదు. ఇలానే మరో ఆరుగురి దగ్గరా దాదాపు 70 కోట్ల మేర వసూలు చేశారు. వీరంతా డబ్బు ఇవ్వాలంటూ ఒత్తిడి తేవడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు.. లీలాకుమార్ లీలలను కనిపెట్టారు. ఈలోగా.. ఏవీఎన్ రెడ్డి తమను మోసం చేశారంటూ ఫిర్యాదు చేయడంతో.. లీలాకుమార్ ను, శారదను అరెస్ట్ చేశారు.
గతంలోనూ సీసీఎస్ లో లీలాకుమార్ పై రుణం తీసుకుని ఎగ్గొట్టారనే అరోపణలతో కేసులు నమోదయ్యాయి. మొత్తం తెలంగాణ, ఏపీలో 8 బ్యాంకులకు 800 కోట్ల దాకా మోసం చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఇందులో హైదరాబాద్ లో 5 బ్యాంకులు, విజయవాడలో 2 బ్యాంకులు, గుంటూరులో 1 బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు..అంతేకాదు ఒకే భూమికి చెందిన ఫోర్జరీ పత్రాలను వేర్వేరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందినట్లు గుర్తించారు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించకపోవడంతో ఆస్తులను సీజ్ చేయాలని నిర్ణయించారు. ఒక బ్యాంకుకు తెలియకుండా మరో బ్యాంకులో ఆస్తులు తనఖా పెట్టినట్లు గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై రిజర్వ్ బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే లీలా కుమార్ పై కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని.. ఏవీఎన్ రెడ్డే దౌర్జన్యంగా వ్యవహిరించాడని ఆరోపిస్తున్నారు లీలా కుమార్ అడ్వకేట్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more