బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి మాటల తూటాలు పేల్చారు. ములాయం సింగ్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లు దేశానికి అపాయంగా మారారని అన్నారు నకిలీ ముస్లింలుగా ఉన్న ములాయం సింగ్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లు దేశానికి ముప్పుగా మారారని అన్నారునరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న పథకాల వల్ల ఎక్కువగా లాభపడుతున్న కేవలం ముస్లింలు మాత్రమే అని సాక్షిమహరాజ్ వెల్లడించారు. ప్రతిపక్షాలు మోదీ తీసుకువస్తున్న పథకాలు, చేస్తున్న అభివృద్దిని తట్టుకోలేకనే ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. భారత్ పాకిస్థాన్ తో చర్చ మీద కూడా చర్చిస్తే వివాదం చేస్తున్నారు.. సరే అలా అని వదిలేసినా దాని మీద వివాదం చేస్తారని అన్నారు నకిలీ ముస్లింల నుండి జాగ్రత్తగా ఉండాలని కూడా ములాయం, నితీష్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లను ఉద్దేశించి అన్నారు.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో గోమాంసం మీద కఠిన చట్టాలు తీసుకువచ్చినట్లు వెల్లడించారు లక్ష మంది ముస్లింలు రాం మందిరం కట్టడానికి అనుకూలంగా ఉన్నారని వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడలేకపోతోందని వివరించారు ఓ సంఘటన జరిగిన 45 రోజుల తర్వాత రెండు లక్షల మంది ముస్లింలు అరాచకానికి పాల్పడితే కనీసం ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితిలో అక్కడి ప్రభుత్వం ఉందని వెల్లడించారు. అలాగే వెస్ట్ బెంగాల్ లో కూడా ఉందని అన్నారు. వేల సంఖ్యలో ముస్లింలు రోడ్ల మీద వచ్చి హింసచేస్తున్నా కానీ మమతా బెనర్జీ మాత్రం ఏ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more