వాళ్లంతా మహిళలు. తన స్వదేశాన్ని వదిలి కోటి ఆశలతో యోమెన్కు వెళ్లారు. తమ యజమానల వద్ద పనికి కుదిరారు. అయితే యజమానుల వేధింపులు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయారు. కానీ కువైట్ పోలీసులకు దొరికిపోయారు. ప్రస్తుతం యెమెన్ లోని ఒక జైలులో నరకం అనుభవిస్తున్నారు. ఒక చిన్న జైలు గదిలో ఇలాంటి అనేకమంది మహిళలతోపాటు ఆమె ఉంటోంది. వీరంతా విపరీతమైన చలిలో కటిక నేలపై నిద్రపోతున్నారు. తాము చేసిన నేరమేమిటో తెలియదు. తాము ఏ జైలులో ఉన్నానో కూడా తెలియదు. స్వదేశానికి ఎప్పుడు పంపిస్తారో తెలియదు. ఈ పరిస్థితిలో వాళ్లు తన బాధనంతా ఒక సెల్ఫోన్ వీడియోలో చిత్రీకరించి.. ఫేస్ బుక్ ద్వారా పంపింది.
వీసా జరిమానాలు, అప్పులు చెల్లించాల్సి ఉండడం, స్పాన్సర్తో వివాదం కారణంగా కువైట్ అధికారులు ఇతర దేశాలకు చెందిన మహిళలను స్వదేశానికి పంపకుండా జైలులోనే ఉంచినట్లు బయటపడింది. వారిని విడిపించడానికి ఇథియోపియా ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తోంది. కువైట్ సహా యెమెన్లలో విదేశీయులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో తీవ్రమైన పోలీసు నిఘా ఉంటుంది. అలాగే కిందిస్థాయి కార్మికులు ప్రయాణించే పబ్లిక్ వాహనాలపై కూడా నిఘా పెడతారు.
యజమానితో ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎవరు పారిపోతున్నా వారిని పట్టుకుని అరెస్టు చేస్తుంటారు. ఏ వివాదం లేకపోతే వారిని కువైట్ నుంచి స్వదేశానికి పంపేస్తారు. ఏ చిన్న వివాదం కానీ, బకాయిలుగానీ ఉంటే జైలులోనే ఉంచుతారు. యెయెన్, కువైట్లో విదేశీయుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా కువైట్ సర్కారు గత ఏడాది 25,000 మంది విదేశీయులను బహిష్కరించి వారి దేశాలకు పంపేసింది. వీరిలో భారత, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు చెందినవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
కాగా బాధిత మహిళల వీడియో ఫేస్బుక్ ద్వారా ఇథియోపియా ప్రజలందరికీ చేరడంతో.. ఈ విషయమై యోమెన్ ప్రభుత్వంతో మాట్లాడి తమను స్వదేశానికి రప్పించాల్సిందిగా ఇథియోపియా ప్రజలు ఇప్పుడు తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అయినా అక్కడి ప్రభుత్వం ప్రజల డిమాండ్ ను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది., దీంతో ప్రజల డిమాండ్ చెవిటీవాడి ముందు శంఖం ఊదినట్లుగా మారుతుందని అక్కడి ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more