విజయవాడలో ‘కాల్ నాగులు’ కొత్త అవతారం ఎత్తారు. కాల్ మనీ కేసులో ఏజెంట్ల, బ్రోకర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనను అపహాస్యం చేస్తూ.. తమ ఆగడాలను అడ్డుకునే వారెవరంటూ అటు ప్రభుత్వానికి, పోలీసులకు సవాల్ విసురుతున్నారు. బాధితుల వద్ద ఆధారాలుంటే.. తనకివ్వాలని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు రక్షణ వలయాన్ని దాటుకుని వారు అయనను ఎలా కలుస్తారు. ఎలా సాక్షాలను ఇస్తారు.
ఇక మరో దారుణమైన విషయం ఏమిటంటే తమ మానాలు బలవంతంగా తీస్తున్న సాక్షాలు మా వద్ద ఎలా వుంటాయని బాధితులు త్రీవ అందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో కాల్ నాగులు బాధితుల నుంచి డబ్బు వసూళ్లు చేసేందుకు క్షుద్రావతారం దాల్చాయి. బాకీ తీర్చలేదంటూ తమ కుటుంబంపై క్షుద్ర ప్రయోగం చేస్తున్నారని మచిలీపపట్నానికి చెందిన దేవిక నాగవెంకట రత్నకుమారి వాపోతున్నది. భర్త ఫొటో చూపించి.. ఆయన మూడేళ్లుగా కనిపించకుండాపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.
ముగ్గురు బిడ్డలను పోషించడం ఎలాగో తెలియక.. తన బాధల్లో తాను ఉంటే.. ‘నీ భర్త మా దగ్గర అప్పులు చేశాడు’ అంటూ దేసు వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు, పుప్పాల వెంకటేశ్వరరావు అలియాస్ కన్నెబాబు ఒత్తిడికి దిగారని తెలిపింది. తమకు అప్పు విషయం తెలియదని చెప్పడంతో.. వేధింపులను తీవ్రతరం చేశారని చెప్పింది. ‘‘క్షుద్ర పూజలు చేసి తాళ్లు, పసుపు కుంకుమలు ఇంటిపైకి విసురుతున్నారు. రోడ్డు మీదకొచినప్పుడు వెనుక నుంచి వచ్చి సిగరెట్లతో కాల్చడాలు, రాళ్లతో కొట్టడాలు చేస్తున్నారు’’ అని వాపోయింది.
అయితే అసెంబ్లీ, మండలి సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు అండగా వుంటామని, ప్రకటించడంతో పాటు.. కాల్ మనీ కేసులో ఎవరైనా ఇంటిపైకి వచ్చి డబ్బులను అడిగితే ఇవ్వకండీ అంటూ ప్రకటించారు. ఒకవేళ అలాంటి వారు వస్తే వెంటనే పోలీసులకు పిర్యాదు చేయండీ అన్న చెప్పిన చంద్రబాబు ఇచ్చిన భరోసా కూడా చెల్లుబాటు కావడం లేదని అమె వాపోయింది. కాల్ మనీ కేటుగాళ్లు తన ఇంటిపై కన్నేయడం వల్లనే ఇదంతా చేస్తున్నారని. అమె తన బాధను వ్యక్తం చేసింది. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులకు పిర్యాదు చేస్తే.. వారూ కూడా కాల్ మనీ కేటుగాళ్లకే వత్తాసు పలుకుతుండటంతో దిక్కు తోచక కుమిలిపోతున్నామని దేవిక కన్నీటిపర్యంతమయింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more