యోగా గురువు బాబా రాందేవ్ నవంబరు 17న మార్కెట్లోకి విడుదల చేసిన అట్టా నూడుల్స్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాయి. హర్యానాలో వినోద్కుమార్ ఈ నూడుల్స్ను కొనగా, అతడికి విపత్కర పరిస్థితి ఎదురైంది. నూడుల్స్ ప్యాకెట్లో పురుగులు దర్శనమిచ్చాయి. నవంబరులో ఇవి మార్కెట్లోకి ప్రవేశించిన వెంటనే ఫుడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆమోదం తీసుకోకుండానే ఈ నూడుల్స్ను మార్కెట్లోకి విడుదల చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాము బాబా నూడుల్స్కు ఎలాంటి అనుమతులూ జారీ చేయలేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది కూడా.
హర్యానాలోని జింద్ ప్రాంతం నర్వానాలో స్వదేశీ స్టోర్లో వినోద్కుమార్ అట్టా నూడుల్స్ ప్యాకెట్ను కొనుగోలు చేశారు. 'దుకాణం నుంచి నెయ్యితోపాటు, నూడుల్స్ ప్యాకెట్ కూడా ఆదివారంనాడు కొన్నాను. వీటిని ఆరోగ్యకరమైనవిగా నేను భావించాను. అయితే తర్వాత రోజు వాటిని వండుతుండగా చనిపోయి వున్న పురుగులు దర్శనమిచ్చా యి. ప్యాకెట్లో సగం నూడుల్స్ మిగిలి ఉండటంతో అందులో చూశాను. వాటిలో కూడా పురుగులున్నాయి. వెంటనే నేను ఫిర్యాదు నమోదు చేసేందుకు పతంజలి దుకాణానికి వెళ్ళాను' అని వినోద్కుమార్ చెప్పారు. ఈ విషయమై దుకాణదారుడిని ప్రశ్నించగా... ఆ ప్యాకెట్ తానే అమ్మానని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం వినోద్కుమార్ పతాంజలీ అట్టా నూడుల్స్పై కోర్టులో దావా వేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 'ప్రపం చంలో మొట్టమొదటిిసారి గా పురుగుల నూడుల్స్ను పతంజలి ప్రవేశపెట్టింది' అని ఒకరు ట్వీట్ చేశారు. 'ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి లేకుండా పురుగుల నూడుల్స్ అమ్ముతున్న అతని చట్టవ్యతిరేక పనికి హ్యాట్సాఫ్' అంటూ మరొకరు ట్వీట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more