బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం ఆ రాష్ట్ర గవర్నర్ రామ్నాథ్ కోవింద్.. నితీశ్తో ప్రమాణం చేయించారు. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణ స్వీకారం చేయడమిది ఐదోసారి. నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని దేవేగౌడ, తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు పలువురు అతిరథ మహారథులు హాజరుకాగా, దాదాపు 2 లక్షల మంది ప్రజలు విచ్చేశారు. 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీల మహాకూటమి 178 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న విషయం విదితమే. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ తనయులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లకు మంత్రి పదవులు దక్కాయి. శుక్రవారం మధ్యాహ్నం బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం లాలు తనయులు తేజస్వి , తేజ్ ప్రతాప్ ప్రమాణం చేశారు. బిహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో ఆ రాష్ట్ర గవర్నర్ రామ్నాథ్ కోవింద్ వీరితో ప్రమాణం చేయించారు. లాలు చిన్న కొడుకు తేజస్వి (26)కి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో లాలు ప్రసాద్ దూరంగా ఉండగా, ఆయన తనయులు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాగా ఇద్దరు తొలిసారి మంత్రులుగా బాధ్యతుల చేపట్టనున్నారు. మరి వారెలా రాణిస్తారో.. బీహర్ ప్రజల్ల మనన్నలు ఎలా సాధిస్తారో వేచి చూడాలి మరి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more