చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. పోలీసులు వారిని చెక్ పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. చైన్ స్నాచర్లు మాత్రం వాటికి ఏమాత్రం భయపడకుండా తమ దందాను కొనసాగిస్తున్నారు. రోడ్డుపై ఒంటరిగా వున్న మహిళల్ని టార్గెట్ చేస్తూ వారి మెడలో వున్న గొలుసుల్ని లాక్కెళ్లిపోతున్నారు. అంతవరకు ఫర్వాలేదుగానీ.. సదరు మహిళలు తమ వెంటపడకుండా వుండేందుకు వారిని తీవ్రంగా గాయపరుస్తున్నారు కూడా. చైన్ లాగుతూనే వారిని కిందపడేస్తూ తీవ్ర గాయాలపాలు చేస్తున్నారు. ఈ తరహాలోనే తాజాగా మరో మహిళ చైన్ స్నాచర్ల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
మంగళవారం సికింద్రాబాద్ కంచన్బాగ్ సాయిబాబా టెంపుల్ ప్రాంతంలో ఆసుపత్రికి తన తండ్రితో కలిసి స్కూటీపై వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును చైన్ స్నాచర్లు అపహరించారు. ఆ మహిళ కాలు సరిగ్గా లేకపోవడంతో చాలా మెల్లగా వెళుతున్న వారిని గమనించిన చైన్ స్నాచర్లు.. ఆమె మెడలో వున్న చైన్ గమనించి దాన్ని అపహరించేందుకు ప్లాన్ వేశారు. సాధారణ వ్యక్తుల్లాగే వారిని కొంతదూరం వరకు బైకులో వెంటాడిన ఆ దుండగులు.. ఒకానొక సందర్భంలో స్పీడుగా వచ్చి ఆ మహిళ మెడలో వున్న గొలుసును లాక్కుపోయారు. దీంతో ఆమె స్కూటీపై నుంచి కింద పడిపోయింది. అప్పటికే కాలు నొప్పితో బాధపడుతున్న ఆ మహిళ చైన్ స్నాచర్ల దాడిలో మరింత గాయాలపాలయ్యింది. ఒకేసారి బైకుపై నుంచి కిందకు పడిపోవడంతో ఆమె తలకు గాయాలయ్యాయి. దీంతో తండ్రి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది.
ఇదిలావుండగా.. ఈ మొత్తం తతంగం సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఈ దాడికి పాల్పడిన చైన్ స్నాచర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిని నగరం దాటకుండా వుండేలా చెక్ పోస్టులకు సమాచారం అందించారని తెలుస్తోంది. వీరిని పట్టుకుంటే.. నగరంలో వుండే ఇంకా చాలామంది చైన్ స్నాచర్ల బండారం బయటపడుతుందని పోలీసులు నమ్ముతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more