వరంగల్ ఉప ఎన్నికలలో తాను బరిలోకి దిగేందుకు అయిష్టతను వ్యక్తం చేసిన సిరిసిల్ల రాజయ్య వినతిని మన్నించి అభ్యర్థిని మారుస్తున్నామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వరంగల్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా ఎంపిన చేసిన రాజయ్య వినతిని పరిగణలోకి తీసుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. రాజయ్య ఇంట్లో విషాదకర చోటుచేసుకోవడం భాధకరమని.. కోడలు సహా ముగ్గురు మనువలు సజీవంగా దహనం కావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
విషాధ ఘటన నేపథ్యంలో రాజయ్య ఎన్నికల బరిలో దిగేందుకు అయిష్టత వ్యక్తం చేయడంతో.. వరంగల్ ఉపఎన్నికలలో అభ్యర్థని మారుస్తున్నామన్నారు. అయితే ఇప్పటికైతే అభ్యర్థిని నిర్ణయించలేదని అన్నారు. అభ్యర్థిని ఎవరనేది మాత్రం వరంగల్ జిల్లా నేతలతో చర్చించిన తరువాతే నిర్ణయిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ బీఫామ్ తో వరంగల్ కు బయలు దేరివెళ్లారు. కాగా వరంగల్ ఉప ఎన్నికలో సర్వే సత్యనారాయణ పేరు కూడా వినిపిస్తుంది. అధిష్టానానికి విధేయుడిగా వున్న ఆయనను వరంగల్ నుంచి బరిలోకి దింపే అంశంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి వరంగల్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే మరో కాంగ్రెస్ నేత శ్రీధర్ పేరు కూడా ప్రముఖంగా వినబడుతోంది. ఎక్కడి నుంచో వచ్చే వలస నేతలకు టిక్కెట్ ఇవ్వడం కన్నా తమ జిల్లాకు చెందిన నేతలకే టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరో గంటలో వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థిపై ప్రకటన చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అభ్యర్థి ఎంపికపై హైకమాండ్ పెద్దలతో ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. మరోవైపు రాజయ్య కోడలి మరణంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీసిందని సమాచారం.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more