జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల నేతృత్వంలోని మహా కూటమి ఒక మహా తాంత్రిక కూటమి అని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం బీహార్లో సుడిగాలి పర్యటన చేసిన మోదీ.. లాలూ సొంత జిల్లా ఛాప్రా, నితీశ్ సొంతగడ్డ నలందతోపాటు పాట్నా, గయలలో జరిగిన ఎన్నికల సభల్లో మాట్లాడారు. లాలూను వదిలించుకునేందుకు తాంత్రికవేత్తతో సమావేశమైన నితీశ్కుమార్.. ఆర్జేడీ అధినేతతో ఎలా జత కట్టారని ప్రశ్నించారు. ఇప్పటివరకు మహా కూటమిలో బడాభాయ్ లాలూ, ఛోటాభాయ్ నితీశ్, మేడం సోనియాగాంధీ మాత్రమే ఉన్నారని తనకు తెలుసునన్నారు.
కానీ నాలుగో వ్యక్తి తాంత్రికవేత్త రంగ ప్రవేశంతో అది మహా అవకాశవాద కూటమిగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో తాంత్రిక విద్యలకు చోటు లేదన్నారు. బీహార్ సీఎం నితీశ్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ తిరోగామి ఎజెండాపై అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. లాలూ, నితీశ్ కులం పేరుతో విషపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీహార్ను 21 శతాబ్దిలోకి తీసుకెళ్లాలంటే 18వ శతాబ్ది నాటి ఆలోచనలు గల వారి నుంచి రాష్ర్టానికి స్వేచ్ఛ ప్రసాదించాల్సి ఉంది. మనకు జంతర్మంతర్ మాయలొద్దు. మన యువత చేతిలో లాప్టాప్లు కావాలి. తావీజ్లు కాదు అని ఆయన అన్నారు. జంగిల్ రాజ్ కావాలో, అభివృద్ధితో కూడిన పాలన కావాలో తేల్చుకోవాలని బీహారీలకు పిలుపునిచ్చారు.
లాలూజీ.. మీరు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద తాంత్రికవేత్త అయితే మీ పార్టీకి రాష్ట్రీయ జాదుటోన పార్టీ అని పేరు పెట్టుకోండి అని మోదీ సలహా ఇచ్చారు. లాలూకు తన ఇద్దరు కుమారుల రాజకీయ భవిష్యత్ తప్ప ఇతరుల సమస్యలు పట్టవన్నారు. తన రాకను స్వాగతిస్తూ సభికులు నినాదాలు చేయడంతో బీహార్ ఎన్నికల్లో విజయం తథ్యమని ఆయన చెప్పారు. ఇది ఎన్నికల ప్రచార సభ కాదని పరివర్తన మేళా అని అభివర్ణించారు. బీహార్ అభివృద్ధికి నితీశ్కుమార్ ప్రకటించిన సప్తసూత్ర పథకానికి ప్రత్యామ్నాయంగా మోదీ ఆరు సూత్రాల పథకం ప్రతిపాదించారు. రాష్ర్టాభివృద్ధిలో కీలకమైన విద్యుత్, నీరు, రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more