‘నా భర్త వస్తాడు.. ఇద్దరం కలిసి మందు తాగుతాం’ అదేంటి ఈ శీర్షిక ఏదో తేడాగా వుందే అనుకుంటే పోరబాటటే. శీర్షికలో కాదండీ ఈ కథలోనే తేడా వుంది. అదేంటి అంటరా..? తాగుబోతు భర్తను దారికి తెచ్చుకునే పనిలో భాగంగా ఓ భార్యమణి చేసిన సాహసం.. అంతా ఇంతా కాదు. తినబోయే ముందు రుచులు ఎందుకన్నట్లు.. ఈ కథను మీరే చదవండీ....మద్యానికి బానిసైన భర్తలో మార్పు తేవాలని అనుకుంది ఓ భార్యమణి. భర్త ఏక్కడ మద్యం తాగుతాడో తెలుసుకుని అతని కంటే ముందే అక్కడికెళ్లింది. భర్త రాగానే ‘ఇద్దరం కలిసి తాగుదాం రా..’ అని పిలవడంతో అతనితో పాటు అక్కడున్న మందుబాబులు అవాక్కయ్యారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కేఆర్జీ నగర్కు చెందిన జయకుమార్, విల్లి భార్యాభర్తలు. ప్రయివేటు కంపెనీలో పనిచేసే జయకుమార్ రోజూ ఫూటుగా మద్యం తాగి ఇంటి కి వచ్చేవాడు. కొన్నాళ్లుగా ఇంటి ఖర్చులకు సైతం ఇవ్వకుండా జీతం మొత్తాన్ని మద్యానికే తగలేస్తుండడంతో విసిగి పోయినన విల్లి మూడురోజుల పాటు భర్తకు తెలియకుండా రోడ్డులో అతన్ని అనుసరించింది. ఏ బార్ లో మద్యం తాగుతున్నాడో తెలుసుకుంది. బుధవారం భర్త కంటే ముందుగా టాస్మాక్ బార్ (ఆబ్కారీ శాఖ నిర్వహించే బార్)కు వెళ్లి మందుబాబుల నడుమ కూర్చుంది.
మందుబాబులు, టాస్మాక్ నిర్వాహకులు ఇక్క డి నుంచి వెళ్లిపోవాలని ఆమెను కోరినా పట్టించుకోలేదు. ‘నా భర్త వస్తాడు.. ఇద్దరం కలిసి తాగుతాం’ .అనటంతో వారు మిన్నకుండిపోయారు. కొద్దిసేపట్లో బార్కు వచ్చిన జయకుమార్ భార్యను చూసి బిత్తరపోయాడు. ‘ఎందుకు వచ్చావ్, వెళ్లిపో’ అంటూ గదమాయించాడు. ‘ఇద్దరం కలిసి తాగుదాం, నాకూఆర్డర్ ఇవ్వు’ అని ఆమె అనటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. చివరకు పోలీసుల సమక్షంలో జయకుమార్ చేత ‘ఇకపై తాగను’ అంటూ వాగ్దానం చే యించాక ఆమె శాంతించింది. ఇకపై తన భర్త మద్యం తాగేందుకు బార్కు వస్తే ఇక్కడే ధర్నా చేస్తానని విల్లి తెలిపింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more