ఆయనేమో వద్దంటారు.. కానీ మేము మాత్రం పంపిస్తామంటూ వీళ్లు.. ఇలా ఏపిలో రాజకీయ నాయకుల మధ్య నడుస్తున్న సంభాషణలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఏపి రాజధాని అమరావతి శంఖుస్థాపనకు ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు అందరికి ఆహ్వానం పంపుతున్నారు. కొంత మందికి స్వయంగా తానే పంచుతున్నారు. కాగా నిన్న ఏపి ప్రతిపక్ష నాయకుడు జగన్ చంద్రబాబుకు ఓ లెటర్ రాశారు. అమరావతి శంఖుస్థాపనకు తనకు ఆహ్వానం పంపించవద్దని.. పంపినా తాను మాత్రం రావడం లేదని తెలుపుతూ ఎనిమిది కారణాలను వివరించారు. అయితే వైసీపీ అధినేత ఇలా ఆహ్వానం మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యడం కొత్త చర్చకు దారి తీసింది. కాగా ఏపి కేబినెట్ మంత్రులలో యనమల మొదటిసారిగా జగన్ లెటర్ మీద స్పందించారు. జగన్ కు ఆహ్వానం పంపించడం మీద ఆయన ఏమన్నారంటే..
అమరావతి శంఖుస్థాపనకు అందరికి ఆహ్వానాలు పంపుతున్నామని.. అందులో భాగంగా ఏపి ప్రతిపక్ష నాయకుడు జగన్ కు కూడా ఆహ్వానం పంపిస్తామని. రావడం, రాకపోవడం ఆయన వ్యక్తిగతమని ఏపి మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ఏపి కేబినెట్ అమరావతి మీద నిర్ణయాలను అమలు చేసి తీరుతామని అన్నారు. ఈ నెల 22న ఏపి నూతన రాజధాని అమరావతి శంఖుస్థాపనకు ఏపి ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లను చేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా, జపాన్, సింగపూర్ కు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపిన చంద్రబాబు.. అమరావతి శంఖుస్థాపనను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more