దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ తడబడుతోంది. టాపార్డర్లో రహానె (51) హాఫ్ సెంచరీ చేయడం మినహా ఇతర బ్యాట్స్మెన్లు విఫలం కావడంతో.. జాగ్రత్తాగా అడుతోంది టీమిండియా. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్ తో తన 60వ హాజ్ సెంచరీని పూర్త చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఎన్నడూ వన్డేలలో మ్యాచ్ ఓటమిని చవిచూడని ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతన్న మ్యాచ్లో భారత్ 43 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ధోనీ, హర్భజన్ సింగ్ బ్యాటింగ్ చేస్తున్నారు. సౌతాఫ్రికా బౌలర్లు మోర్కెల్ రెండు, తాహిర్, రబడా, స్టెయిన్ తలా వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ధోనీసేన ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. 3 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (3) రబడా బౌలింగ్లో బౌల్డవయ్యాడు. ఆ తర్వాత ధవన్, రహానె జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. కాసేపటి తర్వాత ధవన్(23).. మోర్కెల్ బౌలింగ్లో అవుటవడంతో టీమిండియాకు కష్టాలు మొదలయ్యాయి. విరాట్ కోహ్లీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపో్యాడు. జట్టు స్కోరు 82 పరుగుల వద్ద కోహ్లీ (12) రనౌటయ్యాడు. క్రీజులో కుదురుకున్న రహానె కూడా హాఫ్ సెంచరీ చేసిన వెంటనే.. ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్లో బౌల్డయ్యాడు.
ఇక రైనా రావడం ఆలస్యమన్నట్టు ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ బాటపట్టాడు. అక్షర్ పటేల్ (13).. స్టెయిన్ బౌలింగ్లో విక్కెట్ల ముందు దొరికిపోయాడు. ఇక ఏడో వికెట్ గా భువనేశ్వర ప్రసాద్ దొరికిపోయాడు. ప్రస్తుతం క్రీజ్ లో వున్న జట్టు సారధి మహేంద్రసింగ్ ధోని నిలకడగా అడుతూ భారత్ కు గౌరవప్రదమైన స్కోరును కల్పించేందుకు కృషి చేస్తున్నాడు. స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నాడు. ప్రస్తుతం 57 బంతులను ఎదుర్కోన్ని అర్థశతకాన్ని నమోదు చేసిన ధోని.. జోరును కోనసాగించనున్నాడు. మరో ఆటగాడు హర్భజన్ సింగ్ కూడా డుమిని బౌలింగ్ లో ఒక ఫోరు, ఒక సిక్స్ సాయంతో రాణించాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more