AP PCC president Raghuveera Reedy about YS Jagan

Raghuveera about ys jagan

Raghuveera Reddy, Jagan, JaganMohanReddy, Jagan Protest, Chandrababu Naidu, Amaravati, AP Capital

AP PCC President Raghuveera Reddy wish to recover Jagan as possible as soon. Raghuveera also slams Chandrababu Naidu.

జగన్ గురించి రఘువీరా ఏమన్నారంటే..

Posted: 10/13/2015 03:58 PM IST
Raghuveera about ys jagan

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్ల కాంగ్రెస్ నాయకుడు జగన్ కోరుకోవాలని తల్లి కాంగ్రెస్ నాయకుడు కోరుకున్నారు. వైసీపీ అధినేత జగన్ దీక్ష తర్వాత అనారోగ్యంగా ఉన్నారు. అయితే గుంటూరు ప్రభుత్వాసుప్రతిలో ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటున్న జగన్ త్వరగా కోలుకోవాలని ఏపి కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ రఘువీరా రెడ్డి ఆకాంక్షించారు. ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న జగన్ ను ఈ ఉదయం పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. కాగా నిన్నటి దాకా జగన్ దీక్ష మీద కనీసం మాట కూడా మాట్లాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం జగన్ కోలుకోవాలని మాత్రం కోరుకున్నారు. పనిలోపనిగా చంద్రబాబు నాయుడు మీద విమర్శల వర్షం కురిపించారు రఘువీరా రెడ్డి. చంద్రబాబు వైఖరిని ఖండిస్తున్నట్లు కూడా ప్రకటించేశారు.

చంద్రబాబు నాయుడు ఏపిలో ఒంటెద్దు పోకడలు అవలంభిస్తున్నారని రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు వైఖరిని రఘువీరారెడ్డి వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు నూతన రాజధాని అమరాతి నిర్మాణంలో తన మాటే వేదంలా బావిస్తున్నారు.. తాను అనుకుంటున్న దానిని మాత్రమే అమలు చేస్తున్నారని అన్నారు. అమరావతి నిర్మాణంలో ఎవరి అభిప్రాయానికి చంద్రబాబు విలువనివ్వడం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో నీరు కాకుండా డబ్బు ప్రవహించిందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghuveera Reddy  Jagan  JaganMohanReddy  Jagan Protest  Chandrababu Naidu  Amaravati  AP Capital  

Other Articles