ప్రస్తుత ఆధునిక యుగంలో యువత ఎటువంటి జీవన విధానాన్ని ఎంచుకుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమ స్వంత ప్రయోజనాల కోసం తల్లిదండ్రుల మాట పట్టించుకోకపోవడం, ఆస్తికోసం వారితో గొడవ పడటం, ఇంకా ఎన్నో వివాదాలకు యువత తావిస్తోంది. ఎంతో ప్రేమగా తమను ఆలనాపాలనా చూసుకుంటూ, పెంచి పెద్దగా చేసిన తల్లిదండ్రుల ప్రేమానురాగాల కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే.. ఆస్తికి సంబంధించిన తగాదాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే.. తాజాగా వెలుగులోకొచ్చిన తండ్రీకొడుకుల ఆస్తిగొడవ చాలా ఆసక్తికరంగా మారింది. వృద్ధాప్యంలో తనని నిర్లక్ష్యం చేసిన కొడుకులకు ఓ తండ్రి వారికి తగిని శాస్తి చేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్కు చెందిన తావో అనే వృద్ధాప్యుడికి ఇద్దరు కొడుకులు వున్నారు. జీవితాంతో ఎంతో కష్టపడి వారి ఆలనాపాలనా చూశాడు. ఎంతో ప్రేమతో వారిని పోషించి, పెద్ద చేశాడు. పది సంవత్సరాల కింద తన పొలాలన్నీ కొడుకులకు అప్పగించి వేరే చోట ఇల్లు అద్దెకు తీసుకుని చిన్న పాటి ఉద్యోగం చేసుకుంటూ కాలం వెళ్లదీసేవాడు. అనంతరం తన వృద్ధాప్య జీవితాన్ని తన కొడుకుల దగ్గరే వుంటూ గడుపుదామని భావించాడు. దాంతో అతను తన కొడుకుల దగ్గరకు వెళ్లగా.. తమ వద్ద ఉండొద్దంటూ వారిద్దరూ చెప్పేశారు. అంతే! ఆ తండ్రీ ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు. వృద్దాప్యంలో తనను నిర్లక్ష్యం చేసిన ఆ కొడుకులకు తగిన శాస్తి చేయాలనుకుని.. తన సంపాదనలో ఒక్క రూపాయి కూడా వారికి దక్కకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు.
జీవితాంతం తాను కష్టపడి సంపాదించిన డబ్బు కొడుకులకు దక్కకూడదని, ఆ డబ్బంతా తనతో పాటే కాల్చేయాలని పేర్కొంటూ వీలునామా రాశాడు. ఆ వీలునామా ప్రకారం.. ఇటీవల ఆయన చనిపోతే దాదాపు రూ.21 లక్షలు ఆయనతోనే కాల్చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరిని ఆకర్షించింది. కళ్లుమూసుకుపోయిన ఆ ఇద్దరు కొడుకులకు తండ్రి తగిన శాస్తే చెప్పాడంటూ అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more