అగ్రిగోల్డ్ సంస్థ చేసిన మోసానికి తెలుగు రాష్ట్రాల్లో బాధితులు తల్లడిల్లారు. ఎంతో కష్టపడి పోగేసిన డబ్బులు మునిగిపోయాయా అంటూ ఎంతో మంది కన్నీరు పెట్టుకున్నారు. అయితే తాజాగా అగ్రిగోల్డ్ కేసులో ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయాలు.. బాధితులకు చెల్లింపులు కమిటీ పర్యవేక్షణలో జరగాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తొలి విడతలో 14, రెండో విడతలో ఆరు ఆస్తులను విక్రయించాలని కమిటీకి హైకోర్టు ఆదేశించింది. అలాగే హైకోర్టు రిజిస్ట్రార్ పేరుతో బ్యాంక్ ఖాతా తెరవాలని కమిటీకి తెలిపింది. అగ్రిగోల్డ్ ఛైర్మన్ త్రిసభ్య కమిటీకి పూర్తిగా సహకరించాలని కోర్టు వ్యాఖ్యానించింది.
ఏడు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది. డిపాజిటర్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేసి మోసం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై కోర్టు విచారణ జరుపుతోంది. డిపాజిటర్లకు రెండు నెలల్లో న్యాయం జరిగేలా చూస్తామని గతంలో కోర్టు తెలిపింది. ఇక బెంగళూరు, విజయవాడతో పాటు పలు చోట్ల తమకున్న ఆస్తుల వివరాలను అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టుకు తెలిపింది. కాగా ఆస్తుల అమ్మకాలపై విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది. ఖాళీగా ఉన్న భూములను.. అలాగే అమ్మాలా, లేక ఫ్లాట్లుగా చేసి అమ్మాలా దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆస్తుల అమ్మకాలపై విధివిధానాలు, రిటైర్డ్ జడ్జి పేరును కోర్టు సోమవారం ప్రకటించనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more