బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కు నిరాశ మిగిలింది. ఇప్పటికే 1993 ముంబై పేలుళ్ల కేసులో అక్రమాయుధాల చట్టం కింద జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ కు తాజాగా మరోసారి నిరాశ ఎదురైంది. దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం రేపిన కేసులో సంజయ్ దత్ కీలక నిందితుడు. అయితే భారతదేశంలో వ్యవస్థ ఎంత ఆలస్యంగా స్పందిస్తుందో చెప్పడానికి తాజాగా సంజయ్ దత్ కేసునే ఉదహరిస్తున్నారు కొంత మంది మేధావులు. రెండున్నరేళ్ల క్రితం జస్టిస్ మార్కండేయ కట్జూ అప్పట్లో సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా.. సంజయ్ దత్ కు క్షమాభిక్ష పరీశీలించాలని లేఖ రాశారు. అయితే ఇప్పటికి మహారాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించింది.
1993 ముంబై పేలుళ్ల కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. సెర్చ్ లో భాగంగా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఆయుధాలను పోలీసులు గుర్తించారు. దాంతో కోర్ట్ లో ప్రొడ్యూస్ చేయగా.. కోర్ట్ సంజయ్ దత్ కు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే తనకు విధించిన శిక్షను తగ్గించాలని గతంలో సంజుబాబా కోర్ట్ ను కోరారు. అయితే తన శిక్ష కాలాన్ని తగ్గించాలంటూ క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. అయితే దీని మీద సుప్రీంకోర్ట్ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే దాని మీద లేట్ గా అంటే దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత స్పందింన వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్ష పిటిషన్ ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావ్ తిరస్కరించారు. సంజయ్ దత్ కు విధించిన శిక్ష సరైందేనని.. ఎలాంటి క్షమాభిక్ష అవసరం లేదంటూ గవర్నర్ వెల్లడించారు. అయితే ఇందులో ఇంకో కొసమెరుపు ఏంటంటే... ఫిబ్రవరి 2016 నాటికి ముగుస్తోంది. మరో ఏడు నెలలు ఆగితే ఎలాగూ బయటికి వస్తారు అలాంటప్పుడు క్షమాభిక్ష టాపిక్ ఇప్పుడు తెర మీదకు రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more