వినాయక చవితిని పురస్కరించుకుని ఖైరతాబాద్లో కొలువుదీరిన భారీ గణనాయకుడి విగ్రహానికి గవర్నర్ నరసింహన్ దంపతులు తొలి పూజను చేశారు. పూజ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు గవర్నర్ దంపతులను శాలువాతో సత్కరించారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్ దంపతులు గణేశున్ని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వినాయక చవితి సమీపిస్తోందంటే చాలు, తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో కోలాహలం నెలకొనడం ఏళ్లుగా చూస్తున్నదే. వినాయక చవితి సందర్భంగా కొలువుదీరనున్న గణనాధుల విగ్రహాల చేతిలో లడ్డూలను ఉంచడం తెలిసిందే. ఈ లడ్డూలను చేజిక్కించుకునేందుకు నిమజ్జనం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు గంటల తరబడి జరిగే వేలంలో ఉత్సాహంగా పాలుపంచుకుంటారు. ఖైరతాబాదు వినాయకుడి విగ్రహం చేతిలో ఉంచుతున్న లడ్డూ గత కొన్నాళ్లుగా తాపేశ్వరంలో తయారవుతున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఖైరతాబాదు వినాయకుడి కోసం తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పొలిశెట్టి మల్లిబాబు ఈ ఏడాది 5,600 కిలోల లడ్డూను తయారు చేశారు. ప్రస్తుత్తం తాపేశ్వరం నుంచి బయలుదేరిన ఈ లడ్డూ నేటి రాత్రి హైదరాబాదుకు చేరుకునే అవకాశాలున్నాయి. భారీ లడ్డూను ప్రత్యేక వాహనంలో మల్లిబాబు హైదరాబాదుకు తీసుకువస్తున్నారు. ఇక విశాఖలోని 82 అడుగుల భారీ గణేశుడి విగ్రహం చేతిలో పెట్టేందుకు 8,300 కిలోల లడ్డూ తయారైంది. ఈ లడ్డూ కూడా తాపేశ్వరంలోనే తయారైంది. ఈ లడ్డూ ఇప్పటికే విశాఖలోని గాజువాకలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం చెంతకు చేరింది. దీనిని తాపేశ్వరం కేంద్రంగా స్వీట్ల తయారీలో పేరు ప్రఖ్యాతులు గాంచిన శ్రీభక్తాంజనేయ స్వీట్స్ యజమాని సలాది వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు) రూపొందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more