తన ప్రియుడు తనతో అబద్దం చెప్పి తన మాజీ ప్రియురాలిని కలిసాడని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ ప్రియురాలు తన భర్తపై పగ తీర్చకుంది. అది కూడా అలా ఇలా కాదు.. ఏకంగా తన హెయిర్ స్ట్రెయిన్టర్ తో ప్రియుడి పురషాంగాన్ని కాల్చివేసింది. దీంతో ఆ ప్రియుడు! అసాధారణ రీతిలో ప్రియురాలు చేసిన పైశాచిక దాడిలో తన మగతనాన్ని తాత్కాలికంగా కోల్పోయాడు. కేసులోని తీవ్రతను గుర్తించిన కోర్టు నిందితురాలికి జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఆస్ట్రేలియాలోని మౌంట్ బార్కర్ పట్టణంలో బ్రోన్విన్ పార్కర్ (22) అనే యువతి తన బాయ్ప్రెండ్తో కలిసి సహజీవనం చేస్తోంది.
తమ మధ్య ఎలాంటి గొడవలొచ్చినా వారికివారే చిన్నిచిన్న శిక్షలు విధించుకుంటూ.. కలకాలం కలిసుండేలా రాసుకోని ఒప్పందం చేసుకున్నారిద్దరూ. కాగా, సదరు బాయ్ఫ్రెండ్ ఇటీవలే తన మాజీ గర్ల్ఫ్రెండ్ను అనుకోకుండా కలిశాడు. నాలుగు మాటల తర్వాత పాత రోజులు గుర్తుచేసుకుంటూ ఇద్దరూ మైమరచిపోయి ఒక్కటయ్యారు. ఈ సంగతికాస్తా ప్రస్తుత ప్రేయసికి తెలిసిందే. అంతే.. 'నన్ను మోసం చేశావు. మాట తప్పావు' అంటూ అంతెత్తున ఎగిరింది. చేసేదేమీ లేక ఒప్పందం ప్రకారం శిక్ష భరించడానికి సిద్ధమయ్యాడు ప్రియుడు.
వేడివేడి హెయిర్ స్ట్రైటనర్తో అతని ప్రైవేట్ పార్ట్ ను కాల్చేసింది ప్రియురాలు. దాంతో లబోదిబోమంటూ అరుపులు పెట్టాడు బాధితుడు. విషయం పోలీస్ కేసు నుంచి కోర్టుకు చేరింది. 'ఏదో ఆయనకు బుద్ధి చెబుదామని సరదాగా హెయిర్ స్ట్రైటనర్ ను అంటించా. కానీ ఇంత పెద్ద గాయం అవుతుందని ఊహించలేదు' అని న్యాయస్థానంలో వాపోయింది పార్కర్. అయితే జడ్జిగారు మాత్రం ఆమె చేసింది ముమ్మాటికి నేరమేనని తేల్చిచెబుతూ తొమ్మిది నెలల జైలుశిక్ష విధించారు. బాధిత ప్రేమికుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి అవయవాలు మామూలు స్థితికి రావడానికి కనీసం రెండేళ్లు పడుతుందని వైద్యులు పేర్కొన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more