గుజరాత్ రావణకాష్టంలా మండుతోంది. రిజర్వేషన్ల కోసం పటేళ్లు సాగిస్తున్న పోరాటం... హింసకు దారితీయడం తీవ్ర కలకలం రేపింది. అల్లర్లలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. శాంతి భద్రతలు అదుపు చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు. పటేళ్ల సామాజిక వర్గానికి OBC కోటాలో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో మొదలైన ఈ ఉద్యమం... అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. రాజ్కోట్, సూరత్, అహ్మదాబాద్తో పాటు ప్రధాన పట్టాణాల్లో ఆందోళన కారులు రెచ్చిపోయారు. బస్సుల్ని, కార్లను అడ్డుకుని తగలబెట్టారు. బస్టాపులు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేసి, నిప్పుపెట్టారు.
నిరసనకారుల విధ్వంసంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల తీవ్ర స్థాయిలో లాఠీ చార్జీ జరిగింది. పదుల సంఖ్యలో జనానికి గాయాలయ్యాయి. పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి భారీగా బలగాల్ని రంగంలోకి దించారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టిదిట్టం చేశారు. కొన్నిచోట్ల కర్ఫ్యూ, 144 సెక్షన్ను విధించారు. అయినా పరిస్థితి అదుపులోకి వచ్చేలా కన్పించడం లేదు. మరోవైపు లాఠీ ఛార్జి చేయమని తాను పోలీసులకు ఆదేశించలేదని సీఎం ఆనందిబెన్ పటేల్ చెబుతున్నారు. ప్రభుత్వమే లాఠీ ఛార్జికి ఆదేశించిందన్న వ్యాఖ్యలను ఆమె కొట్టిపడేశారు.
సుప్రీంకోర్టు తీర్పుల దృష్ట్యా పటేల్ వర్గీయులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని గుజరాత్ సీఎం చెప్పడంతో ఈ ఉద్యమం తీవ్రంగా మారింది. తమను వెనుకబడిన కులాల్లో చేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపిస్తామని... పటేళ్ల నాయకుడు, 22 ఏళ్ల కుర్రాడు హార్ధిక్ పటేల్ హెచ్చరించాడు. ప్రభుత్వ ఉద్యోగాలు, కాలేజీల్లో రిజర్వేషన్లు దక్కేవరకు తమ పోరాటం ఆగదన్నాడు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ గుజరాత్లో రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న పటేల్ కులస్థులకు పూర్తి మద్దతు ప్రకటించారు. పటేళ్లకు రిజర్వేషన్ల కోసం వారితో కలిసి తామూ పోరాటం చేస్తామని లాలూ ప్రకటించారు.అయితే మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఇలా ఓ వర్గం వారు చేస్తున్న పోరాటం హింసాత్మకంగా మారడం తలనొప్పిగా మారింది. చర్చల ప్రక్రియ ద్వారా సమస్యలను అదిగమించవచ్చు అని మోదీ ప్రత్యేకంగా శాంతి సందేశాన్ని వినిపించినా కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more