ప్రధాని నరేంద్ర మోదీ ఓ రాష్ట్రానికి బంపర్ ఆఫర్ ఇచ్చారు.. కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాత్రం దాని మీద పెదవి విరుస్తున్నారు. గిఫ్ట్ ఇచ్చినందుకు ధ్యాంక్యు అనాల్సింది పోయి నోటినిండా తిడుతున్నారు. ఇంతకీ ఎవరా ముఖ్యమంత్రి అనుకుంటున్నారా..? ఇంకెవరు నితీష్ కుమార్. బీహార్ రాష్ట్రానికి మోదీ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ గురించి నితీష్ కుమార్ విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ బీహార్కు ప్రకటించిన 1.25 లక్షల కోట్ల ప్యాకేజి కేవలం 'రాజకీయ ప్యాకేజి' మాత్రమేనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన ప్యాకేజిలో కేవలం 10,868 కోట్లు మాత్రమే రాష్ట్రానికి అదనంగా లభించిన నిధులని, మిగిలినవన్నీ పాత ప్రాజెక్టులకు సంబంధించినవేనని వివరించారు. ప్రధాని బీహార్కు ప్రకటించిన 'ప్రత్యేక' ప్యాకేజిలో ఎటువంటి ప్రత్యేకత లేదన్నారు. రోడ్లు, విద్యుత్, రైల్వేల వంటి రంగాలలో ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను వివరాలను వెల్లడిస్తూ 'అత్యున్నత స్థానంలో వున్న వ్యక్తి బీహార్ ప్రజల విశ్వాసాన్ని ఏ విధంగా వెక్కిరిస్తున్నార'ని ప్రశ్నించారు.
కేంద్రం ప్రకటించిన స్కిల్ డెవలప్ మెంట్, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాల నుండి బీహార్ను ఎందుకు మినహాయించారు? బీహార్ భారత్లో భాగం కాదా? దీనిలో ప్రత్యేకత ఏమిటని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిలదీశారు. ప్రధాని ప్రకటించిన ప్యాకేజి వెనుక వాస్తవాలను ప్రజలకు వివరించటం రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యత అని ఆయన అన్నారు. ఇప్పుడు ఈ వివరాలన్నింటినీ ప్రజల ముందుంచుతున్నానని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలేనని ఆయన అన్నారు. ఒకవేళ దేశ జిడిపిలో 1 శాతం మేర వున్న ఇంత భారీ ప్యాకేజిని బీహార్కు ఇస్తే దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖ నుండి ఇప్పటివరకూ ఒక్క ప్రకటన కూడా ఎందుకు వెలువడలేదని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఇప్పుడు ఎన్నికల సమయం కనుక బీహార్ ప్రజలను మాయ చేసేందుకే ప్రధాని స్పెషల్ ప్యాకేజ్ అంటూ ప్రకటించారని, ఇది రాజకీయ ప్యాకేజ్ మాత్రమేనని ఆయన పునరుద్ఘాటించారు. గుజరాత్లో కొనసాగుతున్న రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఆయన ప్రస్తావిస్తూ బీహార్ రాత మార్చటానికి బదులు సొంత రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఒక్కసారి చూసుకోవాలని ప్రధానికి చురకలంటించారు. గుజరాత్ రిజర్వేషన్ ఉద్యమానికి తాము ఇప్పటికే మద్దతు ప్రకటించామన్న నితీష్ వారికి రిజర్వేషన్ అవసరమన్నారు. ఇప్పుడు కాకపోతే తరువాతైనా వారికి ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించి తీరాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more