ఒకే ఊరిలో ఉండే వాళ్లు.. ఒకరికి ఒకరు బాగా కావాల్సిన వాళ్లు.. ఒంటరిగా ఏకాంతాన్ని అనుభవించాలనుకున్న వారు.. దగ్గరలోని ఓ లాడ్జికి వెళ్లి గది తీసుకొని ఏకాంత సేవలో మునిగిపోతున్నారు. అహ్మదాబాద్ లో తరుచూ జరుగుతున్న తంతు ఇది. అయితే అక్కడే ఉంటున్న స్థానికులు చాలా మంది ఇలా లాడ్జిలను వాడుకోవడం అక్కడ వివాదాస్పదమవుతోంది. భార్యా భర్తలు కానీ, ప్రేమికులు కానీ ఇలా గదిలో ఉంటూ తమ గోళతాము అనుభవిస్తున్నారు. తాజాగా ఓ లాడ్జిలో ఇలాగే రూం తీసుకున్న ఇద్దరు ప్రేమికులు, ఏదో గొవడపడి చివరకు ప్రియుడు తన ప్రేయసిని చంపేశాడు. దాంతో లాడ్జిల్లో రూంలు ఇవ్వడం మీద తీవ్ర దుమారం సాగుతోంది. అయితే పోలీసులు దీనిపై కొత్త రూల్స్ పెడుతున్నారు.
అహ్మదాబాద్ లో లాడ్జిల్లో కాలక్షేపానికి వస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. లాడ్జిల్లో గదులను అద్దెకు తీసుకొని.. మూడొ వ్యక్తికి తెలియకుండా ఏదేదో చేస్తున్నారు. అయితే ఇలా వచ్చే వారిలో భార్యాభర్తలు కూడా ఉంటున్నారు. అందుకే తాజాగా పోలీసులు లాడ్జిలో గది కోసం వచ్చే ఇద్దరు కూడా రిజిస్టర్ లో సంతకం చెయ్యాలని.. వారి వారి ఐడి ప్రూఫ్ లను కూడా అందించాలని అంటున్నారు. అయితే లాడ్జి గదిని రెండు గంటలలోపు సమయం వరకు మాత్రమే కావాలి అంటూ వస్తే మాత్రం తమకు సమాచారం అందించాలని వారు కోరుతున్నారు. ప్రజల రక్షణ కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని అందరూ సహకరించాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు. ఎలాంటి దుర్ఘటన చోటుచేసుకోకుండా ఉండటానికే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అహ్మదాబాద్ పోలీసులు వివరిస్తున్నారు. మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more