ముంబై నగరాన్ని, చీకటి సామ్రాజాన్ని తన కంటి చూపుతో శాసించే సత్తా ఉన్నా అండర్ వరల్డ్ డాన్, మకుటం లేని చీకటి లోకానికి రారాజు దావూద్ ఇబ్రహీం గురించి తెలియని వారుండరు. ఒక్క భారత్ మాత్రమే కాదు చాలా దేశాలు దావూద్ పేరును హిట్ లిస్ట్ లో పెట్టాయి. అయితే భారతదేశం ఎంతో కాలంగా కాపుకాస్తున్నా కానీ దావూద్ మాత్రం మనకు చిక్కడం లేదు. కానీ దావూద్ తాలూకు విషయాలు తాజాగా వెలులోకి రావడంతో దావూద్ ను పట్టుకోవడానికి, చంపడానికి భారత ప్రభుత్వం కూడా గట్టిగానే ప్రయత్నాలు చేసిందని తెలుస్తోంది. అయితే కాస్తలో దావూద్ చావు మిస్ అయిందని ఓ నమ్మలేని నిజాన్ని మాజీ హోం శాఖ కార్యదర్శి, ప్రస్తుత బీజీపీ నాయకుడు ఆర్కే సింగ్ ఓ ఇంటర్వూలో వెల్లడించారు.
దావూద్ ఇబ్రహీంను హతమార్చేందుకు చోటా రాజన్ ముఠాకు చెందిన కొంత మందిని ఎంపిక చేసి మహారాష్ట్ర బయట శిక్షణ కూడా ఇచ్చింది. అటల్ బిహారి వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, ప్రస్తుతం ప్రధాన మంత్రి జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్న అజిత్ డోవెల్ ఐబీ డెరైక్టర్గా పనిచేసినప్పుడు ఈ కోవర్ట్ ఆపరేషన్కు రంగం సిద్ధం చేశారు. అయితే దావూద్ ఇబ్రహీం డీ కంపెనీతో సంబంధాలున్న ముంబై పోలీసు ఉన్నతాధికారులు డబ్బుకు అమ్ముడుబోయి ఈ వ్యూహాన్ని వమ్ము చేశారు. కోవర్ట్ ఆపరేషన్ కోసం శిక్షణ పొందుతున్న చోటా రాజన్ ముఠా సభ్యులపై అరెస్టు వారెంట్లు తీసుకొచ్చి వారిని అరెస్టు చేశారు.
మొత్తానికి కిల్ దావూద్ పేరుతో జరిగిన సీక్రెట్ ఆపరేషన్ ఓ దశలో దావూద్ ఇబ్రహీం చావు వార్తను తెస్తుందని అనుకున్నా కానీ కొన్ని లోపాల వల్ల విఫలమైంది. అయితే ప్రభుత్వాలు దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినా.. కొంత మంది అధికారుల కారణంగా మొత్తం ఆపరేషన్ నీరుగారిపోయింది. ఒకవేళ అంతా అనుకున్నట్లయితే దావూద్ చనిపోయి నేటికి పది సంవత్సరాలు గడిచిపోయేది. నేటికి కూడా దావూద్ పాకిస్థాన్ లో అక్కడి ప్రభుత్వ రక్షణలో విలాసవంతంగా బుతుకున్నట్లు తాజాగా వెల్లడైంది. కానీ భారత చట్టాల చేతికి దొరకకుండా ఇప్పటికీ దావూద్ దాక్కుంటూనే ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more