రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా అభివృద్ది చెందుతాయి... తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు మరింత ఎగరుతాయి అని ఎంతో ఊహించుకున్న వారికి అసలు సీన్ ఏంటో ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది. అనుకున్న దొక్కటి .. అయ్యిందొక్కటి.. బోల్తా పడ్డావులే... బుల్ బుల్ పిట్ట అని తెలుగు సినిమాలో ఓ పాట ఉంది. అయితే ఇదే లైన్ తెలుగు ప్రజలకు కూడా వర్తిస్తుంది. అటు తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఏపిలో నారా చంద్రాబాబు నాయుడు తమతమ రాష్ట్రాలను అభివృద్ది చేస్తారని అనుకుంటే దాని మీద కాకుండా దుబారా ఖర్చులు ఎలా చేయాలో అన్న అంశంలో ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. నేనంటే నేను అన్నట్లు పోటీగా ఖర్చు చేస్తుండటం విశేషం. ఏపి సిఎం చంద్రబాబు నాయుడుగారి దుబారా ఖర్చు గురించి స్థానికంగానే కాదు నేషనల్ మీడియాలో కూడా ఎంతో పేరు మోసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అనవసర ఖర్చు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే... పక్క వాడు చిటికె వేస్తే .. మనం తొడగొట్టాలి అని మీసాలు మెలేస్తున్నారు అయితే అభివృద్దిలో ఇలా పోటీ పడితే తెలుగు వారు బాగుపడతారు కానీ అలా కాదు.. ప్రజల ఖర్చును ఎలా ఖర్చు చెయ్యాలి అన్నట్లుగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారు. గతంలోనే తన కాన్వాయ్ లోని వాహనాలను మార్చిన కేసీఆర్ మరోసారి ఐదు కోట్లు ఖర్చు చేసి మరోసారి మార్పులు తీసుకువచ్చారు. ఖరీదైన బస్సు, ఖరీదైన కాన్వాయ్ ఇలా తెలంగాణ ముఖ్యమంత్రిగారు ప్రజల సొమ్ములను మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇక ఏసి సిఎం చంద్రబాబు నాయుడు గురించి అయితే దేశం మొత్తం తెలుసు. అయ్యగారు తీసుకువచ్చే ఇన్వెస్టిమెంట్స్ సంగతి ఏమో కానీ ప్రతి పర్యటనకు తడిసిమోపెడవుతోంది. విదేశీ పర్యటనకు, చంద్రబాబు, అతని బృందానికి చేస్తున్న అరేంజ్ మెంట్ లకు భారీ ఖర్చు వస్తోంది. కనీసం ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డబ్బులను ఎలా దుబారాగా ఖర్చు చెయ్యాలి అన్నదాని మీద కాకుండా ఎలా సంపాదించాలి, ప్రజలకు మెరుగైన పాలన ఎలా అందించాలి అన్న దాని మీద దృష్టిసారిస్తే చాలా మంచిది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more